Tuesday, September 17, 2024
HomeదైవంMallapur: జన 'సంద్రమైన' సోమన్న గుట్ట

Mallapur: జన ‘సంద్రమైన’ సోమన్న గుట్ట

రెండవ శ్రావణ సోమవారం అధిక భక్తుల తాకిడి

భక్తుల కోర్కెలు తీర్చే, భక్తుల కొంగు బంగారమైన సోమేశ్వర స్వామి క్షేత్రమైన సోమన్న గుట్టకు రెండవ శ్రావణ సోమవారం రోజు భక్తుల తాకిడి అధికంగా ఉంది. మల్లాపూర్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్న పురాతన సోమేశ్వర స్వామి దేవాలయనికి శ్రావణ మాసంలో భక్తులు అధికంగా వెళ్తారు. రెండవ సోమవారం రోజున ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుండి తరలివచ్చిన భక్తులు సోమేశ్వర స్వామినీ దర్శించుకున్నారు. కొండ పైన ఉన్న కోనేటిలో భక్తులు స్నానాలు ఆచరించారు.

- Advertisement -

స్వామికి ఎంతో ఇష్టమైన వరద పాయాసన్ని సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. సొమేశ్వర కొండ కింద మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మెట్ పల్లి పట్టణ కేంద్రానికి చెందిన ఆర్య వైశ్య సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షులు మైలరపు లింబాద్రి లక్ష్మి దంపతులు అన్నదాతలుగా నిలిచారు. దేవస్థాన కమిటీ సభ్యులు భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News