Sunday, June 30, 2024
HomeదైవంMantralayam: శ్రీమఠంలో మధ్వాచార్యుల రథోత్సవం

Mantralayam: శ్రీమఠంలో మధ్వాచార్యుల రథోత్సవం

మంత్రాలయం శ్రీమఠంలో వైభవంగా శ్రీమధ్వాచార్యుల రథోత్సవం సాగింది. శ్రీమఠంలో పీఠాధిపతులు శ్రీసుభుదేంద్ర తీర్థుల నేతృత్వంలో మధ్వ నవమి వేడుకలు వైభవంగా జరిగాయి. నవరత్నరథంలో ఆశీనులైన మధ్వాచార్యుల రథోత్సవంపై పీఠాధిపతులు పుష్పవృష్టి కురిపించి, మంగళ హారతితో రథోత్సవం ప్రారంభించారు.
శ్రీమఠంలో ఊంజల సేవా మంటపంలో గురుసార్వభౌమ సంస్కృత విద్యాపీఠం విద్యార్థులు, పండితులచే సుమద్వావిజయ పారాయణం, సుమద్వా విజయ ప్రవచన మంగళ కార్యక్రమం, ప్రవచనాలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో ఈపవిత్ర ఘట్టాన్ని తిలకించి ఆశీస్సులు పొందారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News