Saturday, October 12, 2024
HomeదైవంMantralayam: సింహ వాహనంపై పురవీధుల్లో ఊరేగిన మంచాలమ్మ

Mantralayam: సింహ వాహనంపై పురవీధుల్లో ఊరేగిన మంచాలమ్మ

గ్రామ దేవత ఊరేగింపు..

ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో గ్రామ దేవతకు ఊరేగింపు పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దేవి నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని హెచ్.హెచ్. శ్రీ స్వామీజీ శ్రీ మంచాలమ్మకు ఉదయం పవిత్ర సుగంధ ద్రవ్య అభిషేకం నిర్వహించారు. ఈ క్రతువులో ఎస్‌జిఎస్‌ విద్యాపీఠం పండితులు, విద్యార్థులచే వేదమంత్రాలు, దుర్గాసూక్తం పఠించారు. ఈ పవిత్ర ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు, శిష్యులు తరలివచ్చి ఆశీస్సులు పొందారు. సాయంత్రం అమ్మవారిని సుందరంగా అలంకరించి సింహా వాహనం పై కొలువుదీర్చి గ్రామ వీధుల్లో ఊరేగించారు.

- Advertisement -

గ్రామదేవత మంచాలమ్మను పురవీధుల్లో ఊరేగించడం ఇదే తొలిసారి అని.. గ్రామస్తులు, భక్తులు పేర్కొన్నారు. ఊరేగింపు నిర్వహించడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. పీఠాధిపతి నిర్ణయం సరైందేనని హర్షించారు. నవరాత్రుల్లో చేయడం మంగళకరంగా భావిస్తున్నారు. ఊరేగింపులో భక్తులు భక్తి నృత్యాలు చేశారు. బాణాసంచి కాల్చారు. అధికారులు, భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News