ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు అధ్వర్యంలో రాఘవేంద్ర స్వామి పాదుకల పట్టాభిషేకం మహోత్సవం వైభవంగా జరిగింది. గురు వైభవోత్సవాలు రెండో రోజులుగా కనులపండువగా సాగుతున్నాయి.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/03/33795477-f499-44ec-a441-96d386c07ea5-1024x683.jpg)
రాఘవేంద్ర స్వామి నామస్మరణ.. వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య బంగారు సింహాసనంపై కొలువు తీరిన రాఘవేంద్ర స్వామి బంగారు పాదుకలకు జలాభిషేకం, ముత్యాలు, పుష్పాలతో అభిషేకం చేశారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/03/f101bfe6-a50e-46e0-84d6-d5682afe498b-1024x683.jpg)
మంగళ హారతులు ఇచ్చి పాదుకలను పీఠాధిపతి తలపై, హృదయానికి, కళ్ళకు హత్తుకొని భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం ఇతర భాషల్లో ముద్రించిన పుస్తకాలు, గ్రంథాలను అవిష్కరించారు. రాఘవేంద్ర స్వామి పాదుకలను బంగారు రథంపై ఉంచి మధ్య ప్రాకారంలో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/03/c1358aab-5b4b-4a58-bd6f-1824d75dabb2-1024x683.jpg)
సాయంత్రం కళావేదికపై ప్రముఖ నృత్యకరులు, సంగీత విద్వాంసులు సాంస్కృతిక కళాప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మఠం అధికారులు ఏఏఓ మధవసెట్టీ, మేనేజర్లు ఎస్ కే శ్రీనివాసు రావు, వెంకటేష్ జోషి, పీఆర్ ఓఐ పి నరసింహమూర్తి, శ్రీపతి ఆచర్, సురేష్ కోనపుర్, భద్రి, వ్యసరాజచర్, బిందు మాధవ్, జయతీర్థా తదితరులు పాల్గొన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/03/83e6fe2f-b862-4eba-8082-7ca51e8f5576-683x1024.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/03/a85680ef-02ba-41e6-a57e-4b55b185c561-1024x683.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/03/ee660002-08aa-4a1c-8f9e-876008605124-1024x683.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/03/de6f3645-b93a-44ac-98f9-7b579ac34237-1024x683.jpg)