Sunday, July 7, 2024
HomeదైవంPatancheru: పురాతన ఆలయాల జీర్ణోద్దరణకు సంపూర్ణ సహకారం

Patancheru: పురాతన ఆలయాల జీర్ణోద్దరణకు సంపూర్ణ సహకారం

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

నియోజకవర్గంలోని పురాతన ఆలయాల జీర్ణోద్దారణకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.. మండల కేంద్రమైన జిన్నారం గ్రామంలోని తాంబేలు గుట్టపై గల అతి పురాతన శివాలయం జీర్ణోద్ధారణ పనులకు సోమవారం ఉదయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరిలో భక్తి భావం పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, గ్రామ సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News