Friday, September 20, 2024
HomeదైవంDelhi: ఢిల్లీలో శ్రీశైలం లడ్డూ ప్రసాదం

Delhi: ఢిల్లీలో శ్రీశైలం లడ్డూ ప్రసాదం

ఆంధ్రాభవన్ లో దేవస్థాన లడ్డు ప్రసాదాల విక్రయ కేంద్రం

న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవనములో రెండు రోజులపాటు సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జనవరి 14-15వ తేదీలలో రెండు రోజులపాటు ఈ వేడుకలను ఆంధ్రప్రదేశ్ భవన్ నిర్వహిస్తున్నది. సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర దేవదాయ శాఖ వారి సూచనల మేరకు ఆంధ్రాభవన్ లో ఈ దేవస్థాన ప్రసాదాల విక్రయ కేంద్రం ఏర్పాటు చేశారు. సందర్శకుల సౌకర్యార్థం ఏర్పాటు చేయబడిన ఈ విక్రయ కేంద్రంలో సడ్డు ప్రసాదాలు, శ్రీస్వామి వారి దివ్యపరిమళ విభూతి, శ్రీచక్ర పూజా కుంకుమ, కైలాస కంకణాలు భక్తులకు అందుబాటులో ఉంచారు.

- Advertisement -

శ్రీశైల దేవస్థానం ప్రచురించిన వివిధ రకాల క్యాలెండర్లు, డైరీలు, శ్రీశైలప్రభ మాసపత్రికలు కూడా ఈ విక్రయ కేంద్రంలో విక్రయిస్తున్నారు. రెండు రోజులపాటు నిర్వహించే ఈ విక్రయ కేంద్ర నిర్వహణకు శ్రీశైలం నుంచి ప్రత్యేకంగా సిబ్బంది ఢిల్లీ వెళ్ళారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News