శ్రీశైలం మల్లన్న దేవాలయంలో జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ. 5,07,46,508/- నగదు రాబడి లభించింది. కాగా ఆలయ హుండీల ఆదాయాన్ని భక్తులు గత 34 రోజులలో (11.08.2023 నుండి 13.09.2023 వరకు) సమర్పించినది మాత్రమే. ఈ హుండీలో 324 గ్రాముల 500 మిల్లీ గ్రాములు బంగారు, 10 కేజీల 050 గ్రాముల వెండి లభించాయి. 839 యుఎస్ డాలర్లు, 1115 యూఏఈ దిర్హమ్స్ 130 – యూరోప్, 100 – ఆస్ట్రేలియా డాలర్లు, 100 – మలేషియా రింగిట్స్, 85 – ఇంగ్లాండు పౌండ్స్, 10 – సింగపూర్ డాలర్లు.. 10 – ఎస్.ఏ.యు రియాల్స్, మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టారు. ఈ హుండీల లెక్కింపులో అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/09/0e10a2f2-4bb1-4fc6-964a-d6aff4ff6f35-1024x724.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/09/9b5b3d48-a8f4-40b1-95e4-c8c392ed5184-1024x738.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/09/569dec3e-3d11-4264-970a-fc54a07afb8b-1024x793.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/09/3162c5f2-ac36-4547-9c61-067227565c66-1024x732.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/09/df3400ee-1586-46dd-9eb8-8c238c5f84b9-1024x751.jpg)