Sunday, September 29, 2024
HomeదైవంSrisailam: శ్రీశైల ఆలయానికి పెరిగిన భక్తులు

Srisailam: శ్రీశైల ఆలయానికి పెరిగిన భక్తులు

మల్లన్న దర్శనానికి దర్శనానికి 8 గంటలు సమయం

శ్రీశైలం ముక్కంటి ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుసగా వారాంతపు సెలవులు కావడంతో క్షేత్రంలో భక్తులు రద్దీ భారీగా పెరిగింది. క్షేత్రమంతe భక్తజనంతో సందడి నెలకొంది. శ్రీశైల క్షేత్రంలో ఎక్కడ చూసినా భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులు వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్ లో దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు.

- Advertisement -

శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో లవన్న ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనార్థమై క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు, మంచినీరు అందిస్తున్నారు. వరుస సెలవుల కారణంగా నేడు, రేపు కూడా క్షేత్రానికి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని ఆలయ అధికారులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News