తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న 17-06-2025 రోజున స్వామివారిని మొత్తం 81,037 మంది భక్తులు దర్శించుకున్నట్లు టీటీడీ తెలిపింది. మరోవైపు నిన్న స్వామి వారికి 30, 548 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని పేర్కొంది. ఇక హుండీ ఆదాయం విషయానికొస్తే.. తిరుమలలో నిన్న స్వామి వారికి రూ. 4.12 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపింది.
నేడు..
టికెట్ లేని భక్తుల సర్వదర్శనానికి సంబంధించి.. అన్ని కంపార్ట్ మొంట్లు నిండి భక్తులు బయట క్యూ లైన్ లో వేచి ఉన్నారని తెలిపింది టీటీడీ.
టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి సుమారు 18 గంటలు సమయం పట్టవచ్చునని తెలిపింది.
ఇక SSD టోకెన్స్ కలిగిన భక్తులకు అయితే సుమారు 4 – 6 గంటలు సమయం పడుతుందని తెలిపింది.
రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 3 – 4 గంటలు సమయం పట్టనుందని టీటీడీ పేర్కొంది.