తిరుమలలో జరుగనున్న బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా సీఎం జగన్ ను టీటీడీ ఆహ్వానించింది. ఈమేరకు సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసి టీటీడీ సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఆహ్వనించారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏ.వి.ధర్మారెడ్డి ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రికతో పాటు శ్రీ వేంకటేశ్వరస్వామి వారి శేషవస్త్రం, తీర్ధ ప్రసాదాలు అందజేశారు డిప్యూటీ సీఎం, టీటీడీ ఛైర్మన్, ఈవో. అనంతరం వేద పండితుల వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఈ నెల 18 నుంచి 26 వరకు 9 రోజుల పాటు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/09/7841715f-bd8f-45bc-823a-7b43ff62aa74-713x1024.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/09/550c2f25-ce70-4e19-9c14-26bc85e7bae9-1024x371.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/09/c00081a0-b651-4503-b813-d4a64ffb7a76-1024x439.jpg)