Saturday, October 5, 2024
HomeదైవంTTD: టీటీడీ చైర్మన్ చే గోవింద కోటి పుస్తకాల పంపిణీ

TTD: టీటీడీ చైర్మన్ చే గోవింద కోటి పుస్తకాల పంపిణీ

గోవింద కోటి లిఖిత కార్యక్రమం ఆచరణలోకి

వినాయక సాగర్ లో గోవింద కోటి వినాయకుడికి ప్రత్యేక పూజలు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి తొలి సమావేశంలోనే ప్రవేశ పెట్టిన గోవింద కోటి లిఖిత కార్యక్రమం ఆచరణలోకి తేవడానికి తొలి అడుగుపడింది.

- Advertisement -

వినాయక సాగర్ లో ఏర్పాటు చేసిన గోవింద కోటి వినాయకుడి సాక్షిగా శాసన సభ్యులు, టీటీడీ చైర్మన్
భూమన కరుణాకర రెడ్డి భక్తులకు గోవింద కోటి పుస్తకాలు పంపిణీ చేశారు. విఘ్నాలను హరించే వినాయకుడే గోవింద కోటి రాస్తున్నట్లుగా తయారు చేసిన విగ్రహం ఎంతగానో ఆకట్టుకుంది. చైర్మన్
కరుణాకర రెడ్డి ముందుగా వినాయకుడి పూజలో పాల్గొన్నారు. విగ్రహం ఏర్పాటు చేసిన మండపం నలువైపులా గోవింద కోటి నామం రాయడం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. వినాయకుడు ప్రజలందరికీ శుభం జయం కలిగించాలని, శ్రీ వేంకటేశ్వర స్వామి , శ్రీ వినాయకుడి ఆశీస్సులతో తిరుపతి నగరం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని కరుణాకర రెడ్డి ప్రార్థించారు. నగర మేయర్ డాక్టర్ శిరీష, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి హరిత, గోవింద కోటి వినాయక విగ్రహ కాన్సెప్టర్ శ్రీ కిషన్ ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News