Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్Immediate Justice: సామాన్యులకు సత్వర న్యాయం అందని ద్రాక్షేనా!

Immediate Justice: సామాన్యులకు సత్వర న్యాయం అందని ద్రాక్షేనా!

సెలబ్రిటీలు, సంపన్నుల కోసం హాలిడేస్ లోనూ పనిచేసే కోర్టులు

ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం గల మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రధానంగా నాలుగు స్తంభాల ఆధారంగా మనుగడ కొనసాగిస్తుంది. వాటిలో మొదటి స్తంభం పార్లమెంటు, శాసన సభలు. ఈ చట్ట సభల ద్వారా చట్టాలను రూపొందించి పాలనా విధానాలకు రూపం ఇస్తారు. రెండవ స్తంభం కార్యనిర్వాహక వ్యవస్థ. చట్ట సభలైన పార్లమెంటు, శాసనసభలలో ఆమో దింపబడిన విధానాలను అమలు చేయడం కార్యనిర్వాహక వ్యవస్థ విధి. మూడవ స్తంభం న్యాయ వ్యవస్థ. ప్రభుత్వాలు రూపొందించే చట్టాలు, నిర్ణయాలు, వాటి అమలు రా జ్యాంగ నిబంధనల పరిధిలో ఉన్నాయో లేదో, రాజ్యాంగం ప్రాథమిక సూత్రాలకు లోబడి ఉన్నాయో లేదో సమీక్షించ టానికి ఏర్పాటు చేసిన వ్యవస్థ న్యాయ వ్యవస్థ. భారత దేశ న్యాయ వ్యవస్థలో భాగంగా 26 జనవరి 1950న స్థాపిం చబడిన సుప్రీంకోర్టుతో సహా హైకోర్టులు, జిల్లా, మునిసి పల్‌, గ్రామ స్థాయిలలో సబార్డినేట్‌ కోర్టులు పని చేస్తాయి. ప్రజాస్వామ్య మూల స్తంభాలలో నాల్గవది, చివరిది వార్తా వ్యవస్థ. అయితే భారత ప్రజాస్వామ్య వ్యవస్థ మూల స్తం భాలలో ఒకటైన న్యాయ వ్యవస్థ సత్వర న్యాయాన్ని అం దించడంలో విఫలమవుతుందన్న విమర్శలు తరుచూ వినబడుతుంటాయి. వంద మంది నేరస్తులు తప్పించుకున్నా ఫర్వాలేదు కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్షింపబడకూడదు అన్న మౌలిక సూత్రం ఆధారంగా పని చేసే మన న్యాయ వ్యవస్థ ఆలస్యంగా అందించే న్యాయం, న్యాయ నిరాకరణ తో సమానం అనే విషయాన్ని కూడా స్ఫూర్తిగా తీసుకుని పనిచేస్తే బాగుంటుంది.
న్యాయ దేవత
సాధారణంగా మనం న్యాయస్థానాలలో న్యాయ దేవ త ప్రతిమ ఒక చేతిలో త్రాసు, మరో చేతిలో కత్తి, కళ్ళకు గంతలు కట్టబడి ఉండటాన్ని గమనిస్తాము. ఇవి న్యాయ దేవతకు చిహ్నాలుగా 16వ శతాబ్దం నుండి మనుగడలో ఉన్నాయి. ఆమె కళ్ళ గంతలు ప్రతీకాత్మకం. ఒక వ్యక్తి యొక్క జాతి, లింగం, సంపద, అధికారం లేదా న్యాయాన్ని ప్రభావితం చేసే ఇతర అంశాలను న్యాయ దేవత చూడదని, ఆమె నిష్పక్షపాతంగా ఉంటుందని, మనుషుల్లో విభే దాలకు/వ్యత్యాసాల పట్ల గుడ్డిగా ఉంటుందని అర్థం. సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకుని పక్షపాతం లేకుండా న్యాయం అందజేయబడుతుంది అని అర్ధం. కత్తి ఎప్పుడూ త్రాసు కంటే కింద భాగాన ఉంటుంది. ఎందుకంటే సాక్ష్యం తూకం వేసిన తర్వాత, అంటే నేరం ఋజువైతేనే శిక్ష విధించబడుతుందనటానికి ఇది సూచన. అయితే అలానే ఉండాలనే నిబంధన ఏదీ లేకపోవడంతో న్యాయ దేవత ఒక్కో చోట ఒక్కోలా దర్శనమిస్తుంది.
పలుకుబడి ఉంటే సత్వర న్యాయం
భారత న్యాయ వ్యవస్థలో ఒక వ్యక్తి యొక్క జాతి, లింగం, ఆర్ధిక స్థితిగతులు, అధికారం తదితర అంశాలు న్యాయ దేవతను ప్రభావితం చేయజాలవని, ఆమె దృష్టిలో అందరూ సమానమేనని, నిష్పక్షపాతంగా సాక్ష్యాధారాలను పరిగణ లోనికి తీసుకున్న తరువాతనే న్యాయం వెలువరిస్తుందని అంటారు. అయితే సమాజంలో పలుకుబడి గలవారు, సంపన్నుల కోసం న్యాయస్థానాలు సెలవు దినాలలో సైతం పనిచేసిన దృష్టాంతాలు చరిత్రలో ఉన్నా యి. 2002 నాటి గుజరాత్‌, గోద్రా అల్లర్లకు సంబంధించి తప్పుడు సాక్ష్యాధారాలను సృష్టించి ఉన్నతాధికారులను ఇరికించడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొం టున్న సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌ కేసు కోసం సెలవు దినం అయినప్పటికీ శనివారం, 1 జూలై 2023 న సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం ప్రత్యేకంగా సమావేశమవడం అలాంటిదే. తొలుత సుప్రీంకోర్టులో ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాల తో కూడిన ద్విసభ్య ధర్మాసనం సాయంత్రం 6:30 గంట లకు తీస్తా పిటిషన్‌ను విచారించింది. ఇద్దరు న్యాయ మూర్తుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో త్రిస భ్య ధర్మాసనానికి కేసు బదిలీ అయ్యింది. శనివారం రాత్రి 9:15 గంటలకు దీనిపై జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిజ్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాతో కూడిన త్రిసభ్య ధర్మా సనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు బెంచ్‌, వెంటనే లొంగిపోవాలన్న గుజరాత్‌ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. తీస్తా సెతల్వాద్‌ కు ఏడు రోజుల మధ్యంతర రక్షణ కల్పి స్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. చట్ట ప్రకారం మహిళగా ప్రత్యేక రక్షణ పొందేందుకు తీస్తా సెతల్వాద్‌ అర్హురాలని సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా వ్యాఖ్యా నించింది. హైకోర్టు ఉత్తర్వులపై అప్పీలు చేసుకునేందుకు ఆమెకు సమయం ఇవ్వకపోవడం నిర్హేతుకమని న్యాయ మూర్తులు అభిప్రాయపడ్డారు. తీస్తా సెతల్వాద్‌ కేసులో సుప్రీం కోర్టు చూపిన ప్రత్యేక చొరవ, సాధారణ విచారణ ఖైదీల కేసులలో కూడా చూపగలిగిన నాడు మన న్యాయ వ్యవస్థ తప్పకుండా ప్రజల మన్ననలు చూరగొంటుంది.
జైళ్ళల్లో మగ్గుతున్న విచారణ ఖైదీలు
దేశంలోని వివిధ జైళ్లలో ఉన్న మొత్తం ఖైదీలలో దాదాపు 4 లక్షల మందికి పైగా విచారణ ఖైదీలు ఉండడం మన న్యాయ వ్యవస్థ నత్తనడకకు దర్పణం పడుతుంది. ఎందుకు సమాజంలో కేవలం పలుకుబడి గల నిందితులు మాత్రమే సత్వర న్యాయం పొందగలుగుతున్నారు? కోర్టు ల దృష్టిని అంతగా ప్రభావితం చేయగల అంశాలు ఏమి టి? అని ప్రశ్నించుకుంటే భారీ ఫీజులు వసూలు చేసే పలుకుబడి గల న్యాయవాదుల ద్వారా మాత్రమే సత్వర న్యాయం సాధ్యమవుతుందన్న విషయం మనకు బోధ పడుతుంది. అయితే మధ్యాదాయ, స్వల్పాదాయ విచారణ ఖైదీలకు ఇంత భారీ మొత్తంలో ఫీజులు చెల్లించి ఖరీదైన న్యాయవాదులను నియమించుకోవడం సాధ్యమయ్యే పనే నా? దేశంలోని మొత్తం విచారణ ఖైదీలలో దాదాపు 60 శాతం మంది అట్టడుగు వర్గాలకు చెందినవారు కావడం గమనార్హం. అంటే వారి ఆర్ధిక పరిస్థితి కారణంగా వారు విచక్షణకు గురవుతూ జైళ్లలో పడి మగ్గాల్సిందేనా? ఆరోప ణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఏ రాజకీయవేత్తో, సెలబ్రిటీనో లేదా ధనవంతుడో అయితే ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల ద్వారా త్వ రితగతిన విచారణ పూర్తవుతుంది. దేశంలో కొందరు ప్ర ముఖ న్యాయవాదులు రు.15 నుండి 20 లక్షలు ఫీజు వసూలు చేస్తూ సత్వరమే న్యాయ ప్రక్రియ పూర్తయ్యేం దుకు దోహదపడుతున్నారు. అలా అని న్యాయవాదులం దరూ అలానే ఉంటారనుకుంటే పొరబాటే. మన దేశంలో కక్షిదారు ఆర్ధిక స్థితిగతులను బట్టి పూర్తి ఉచితంగా లేదా నామమాత్రపు ఫీజు తీసుకుని నిబద్ధతతో వ్యాజ్యాలు నడిపే న్యావాదులూ లేకపోలేదు. దేశంలోని వివిధ జైళ్ళలో ఉన్న ఖైదీలలో 77 శాతం మంది (4.27 లక్షలకు పైచిలుకు) విచారణ ఖైదీలు అని తెలిస్తే ఆశ్చర్యం కలుగక మానదు. నేరం మోపబడి విచారణ ప్రక్రియ పూర్తి కానందున జైలు లో ఉండే నిందితులను విచారణ ఖైదీలు అంటారు. వీరిలో దాదాపు 60 శాతం మంది దళితులు, బలహీన వర్గాలకు చెందిన వారు. ఆందోళన కలిగించే మరో అంశం ఏమి టంటే దేశవ్యాప్తంగా దాదాపు 50 లక్షల కేసులు పెండింగ్‌ లో ఉండటం. ఒక పక్క సాధారణ విచారణ ఖైదీలు దశా బ్దాల తరబడి న్యాయం కోసం పడిగాపులు పడుతుండగా మరోపక్క రాజకీయవేత్తలు, సెలబ్రిటీలు, సంపన్నులు తమ అర్థబలం, పరపతి, పలుకుబడులతో సత్వరం న్యాయ ప్ర క్రియను పూర్తిచేయించుకోగల్గుతున్నారు. ఈ నేపథ్యంలో, ధన బలం, పలుకుబడి లేక జైళ్ళల్లో మగ్గుతున్న సాధారణ విచారణ ఖైదీల వెతలను గుర్తించిన సుప్రీం కోర్టు ఈ సమ స్య పరిష్కారానికి, కోర్టులలో పెండింగ్‌ కేసులను తగ్గించేం దుకు దిగువ కోర్టులకు జైలుకు బదులుగా బెయిలు లాంటి మార్గదర్శకాలను సూచించినప్పటికీ క్షేత్ర స్థాయిలో ఆశిం చిన ప్రగతి కనిపించడం లేదు. సమాజంలో పలుకుబడి గల రాజకీయవేత్తలు, సెలబ్రిటీలు, సంపన్నుల కోసం సెలవు రోజున కూడా పనిచేసే కోర్టులు సాధారణ విచారణ ఖైదీల కోసం కూడా అదే ప్రక్రియను అవలంబించడానికి వారికి ఉన్న ప్రతిబంధకాలు ఏమిటో మరి!
భారత న్యాయ వ్యవస్థ
భారత న్యాయవ్యవస్థలో భాగంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుతో సహా 25 హైకోర్టులు ఉన్నా యి. భారత రాజ్యాంగంలో పేర్కొన్న గరిష్ట సంఖ్య 34 కు గాను, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధనంజయ (డి) వై చంద్రచూ్‌డ తో సహా సుప్రీం కోర్టులో ప్రస్తుతం 31 మంది న్యాయమూర్తులు ఉన్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి రు.2.80 లక్షలు, సుప్రీం కోర్టులోని ఇతర న్యాయ మూర్తులు రు.2.50 లక్షలు నెలసరి జీతంతో పాటు వివిధ రకాల భత్యాలు అందుకుంటారు. 65 సంవత్సరాలకు పద వీ విరమణ చేసే సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, పదవీ విరమణానంతరం పింఛనుతో పాటు కరువు భత్యం కూడా పొందుతారు. ప్రతి హైకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి తో పాటు ఆయా కోర్టులకు మంజూరైన గరిష్ట సంఖ్య ప్రకారం న్యాయమూర్తులు ఉంటారు. ప్రధాన న్యాయ మూర్తితో పాటు తెలంగాణ హైకోర్టుకు గరిష్టంగా 42 మంది న్యాయమూర్తులు మంజూరు కాగా అందులో 32 మంది శాశ్వత, 10 మంది తాత్కాలిక న్యాయ మూర్తులు ఉన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూరి రూ.2.50 లక్షలు, హైకోర్టు ఇతర న్యాయమూర్తులు రు.2.25 లక్షలు నెలసరి జీతంతో పాటు వివిధ రకాల భత్యాలు అందుకుం టారు. 62 సంవత్సరాలకు పదవీ విరమణ చేసే హై కోర్టు న్యాయమూర్తులు, పదవీ విరమణానంతరం పింఛనుతో పాటు కరువు భత్యం కూడా పొందుతారు.
నిపుణుల సూచనలు
సుప్రీంకోర్టు, హైకోర్టులు, జిల్లా కోర్టులు కేసుల భారంతో సతమవుతుండటంతో న్యాయ ప్రక్రియలో అపా రమైన జాప్యం ఏర్పడి వ్యాజ్యాలు దశాబ్దాల పాటు కొన సాగడానికి కారణమవుతున్నాయి. భారతదేశంలో న్యాయ వ్యవస్థ ప్రస్తుతం అనేక సవాళ్ళను ఎదుర్కొంటోందని, ఈ క్రింది చర్యలు చేపట్టడం ద్వారా పరిస్థితిలో కొంత సాను కూల మార్పు తీసుకువచ్చే అవకాశం ఉందని న్యాయ నిపు ణుల అభిప్రాయం:
వ్యాజ్యం అనేది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో అనేక సందర్భాల్లో, సామాన్య ప్రజలు న్యాయ పరమైన చర్యలను భరించలేక తమ హక్కులు, దావాలను వదులుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి ఆర్ధిక స్థోమత లేని వారికి ప్రభుత్వ న్యాయవాది ద్వారా ఉచిత న్యాయ సహాయం అందించే సౌలభ్యం అందుబాటులో ఉన్న విషయం గురించి విస్తృత అవగాహన కల్పించాలి.
కుప్పలుతెప్పలుగా పేరుకుపోతున్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయవ్యవస్థలో సరిపడా మానవ వనరులు మరియు మౌలిక సదుపాయాలు లేకపోవడం కూడా ఒక ప్రధాన సమస్య. న్యాయస్థానాలు ఆధునిక సాంకేతిక పరి జ్ఞానాన్ని వినియోగించుకుని విచారణ ప్రక్రియ వేగవంతా నికి కృషి చేయాలి. నేటి డిజిటల్‌ యుగంలో సంభవిస్తున్న పెను మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుని న్యాయ స్థానాల సమాచార నిధి లభ్యతను విస్తృతపర్చుకోవడంతో పాటు విచారణ ప్రక్రియను సాంకేతిక ఆధారాలతో పూర్తి ఖచ్చితత్వంతో పూర్తి చేసే మార్గాలను శోధించాలి. బ్రిటీష్‌ కాలంలో ఏర్పాటైన కాలం చెల్లిన చట్టాలను సమీక్షించి వాటికి అవసరమైన సవరణలను చేపట్టడమో లేదా పూర్తిగా రద్దుచేయడమో చేయాలి.
సబార్డినేట్‌ కోర్టులలో అధిక సంఖ్యలో కేసులు ఉండ డంతో తరచూ వాయిదాల కారణంగా ఆలస్యం జరుగు తోంది. సబార్డినేట్‌ కోర్టులలో కేసుల సంఖ్యను తగ్గించడా నికి లోక్‌ అదాలత్‌ లాంటి వ్యవస్థ ద్వారా సాధారణ కేసు లను పరిష్కరించగలిగితే కొంత ఊరట లభించే అవకాశం ఉంది. భారతదేశంలో 10 లక్షల మందికి 21 మంది న్యాయమూర్తులు ఉన్నారు. ఈ నిష్పత్తిని మెరుగుపరచాల్సిన అవసరాన్ని లా కమిషన్‌ 245 వ నివేదికలో నొక్కి చెప్పింది. ఈ సూచనపై దృష్టి సారించి తగు చర్యలు చేపట్టాలి. భారత దేశ న్యాయ వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేయడానికి, సత్వర న్యాయ పరిష్కారాలు అందించడా నికి చట్ట సభలు, సంబంధిత ప్రభుత్వ శాఖలు, న్యాయకో విదులు పూర్తి సమన్వయంతో పనిచేస్తే ఈ సమస్యకు పరిష్కారం తప్పక లభిస్తుంది.

  • యేచన్‌ చంద్ర శేఖర్‌
    మాజీ రాష్ట్ర కార్యదర్శి
    ది భారత్‌ స్కౌట్స్‌, గైడ్స్‌, తెలంగాణ
    8885050822
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News