గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః” అంటూ గురువును కీరిస్తారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అలాంటి గురువులను స్మరించుకుందాం.
గురువుని పరబ్రహ్మ స్వరూపం. మనిషిలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే గురువుని ఇలలో ప్రత్యక్ష దైవంగా భావించి పూజిస్తారు. సమాజానికి మంచి పౌరులను అందిస్తారు.
అటువంటి గురువుని పూజించేందుకు మనం మన దేశం తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజున సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఉపాధ్యాయ దినోత్సవం ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన భారతదేశంలోని 5 గొప్ప ఉపాధ్యాయుల గురించి తెలుసుకుందాం.. వీరి గురించి నేటి తరం పిల్లలకు తప్పనిసరిగా చెప్పాలి.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చరిత్రలో అత్యుత్తమ ఉపాధ్యాయుల గురించి మాట్లాడుకుంటే.. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మొదటిస్థానంలో నిలుస్తారు. ఆయన భారతదేశానికి రెండో రాష్ట్రపతి, తొలి ఉపరాష్ట్రపతి అయినప్పటికీ, విద్య పట్ల ఆయనకున్న అంకితభావం కూడా అపారమైనది. తత్వశాస్త్రంలోని అత్యంత క్లిష్టమైన భావనలకు కూడా ఆయన దోహదపడ్డారు. ఉపాధ్యాయులే నిజమైన దేశ నిర్మాతలు అని నమ్మిన దార్శనికుడు.
చాణక్యుడు చంద్రగుప్త మౌర్య రాజు సలహాదారుడు. ఆయన అన్ని కాలాలలోనూ అత్యంత గొప్ప ఉపాధ్యాయుడు. చాణక్యుడి బోధనలను నేటికీ ప్రజలు అనుసరిస్తున్నారు. చరిత్రలో అత్యుత్తమ ఉపాధ్యాయులలో ఒకరైన చాణక్యుడు రాసిన అనేక రచనలలో నీతి, రాజకీయాలు, ఆర్థిక శాస్త్రాలు ఆయన బోధనలు ఆ కాలానికి చాలా సందర్భోచితంగా ఉన్నాయి.
సావిత్రిబాయి ఫూలే ఆమె భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. 1848లో తన భర్తతో కలిసి, అంటరాని బాలికల కోసం పాఠశాలలను ప్రారంభించడం ద్వారా దేశాన్ని విప్లవాత్మకంగా మార్చిన మొదటి మహిళా ఉపాధ్యాయురాలు. దేశంలో బాలికల విద్య కోసం ప్రచారాన్ని నిర్వహించేది. ఆమె మొదటి బాలికల పాఠశాలకు ప్రిన్సిపాల్. ఆ సమయంలో, ఆమె బాలికల విద్య కోసం అన్ని ప్రయత్నాలు చేసింది.
మన జాతీయ గీతాన్ని రచించిన రవీంద్రనాథ్ ఠాగూర్ విద్య పట్ల తన ప్రత్యేక దృక్పథంతో ప్రసిద్ధి చెందారు. “బోధన ప్రధాన లక్ష్యం వివరణలు ఇవ్వడం కాదు, మనస్సు తలుపులను తట్టడం” అని ఆయన విశ్వసిస్తారు. అందువల్ల ప్రాథమిక విద్యతో శారీరక కార్యకలాపాలను జోడించడం ద్వారా ఆరోగ్యకరమైన అభ్యాస భావనను ఆయన ప్రవేశపెట్టారు. శాంతినికేతన్, విశ్వభారతి విశ్వవిద్యాలయం స్థాపించారు. ఆయన తరగతి గదికే పరిమితం కాకుండా, నాటకం, సంగీతం వంటి కార్యకలాపాలకు ప్రాధాన్యతనిచ్చిన వినూత్న గురువు. రచయితగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా ఆయన చేసిన కృషి మరువలేనిది.
భారతదేశపు గొప్ప ఉపాధ్యాయులలో స్వామి వివేకానంద కూడా ఒకరు. స్వామి వివేకానంద తన అసమానమైన మేధస్సుకు ప్రసిద్ధి చెందారు. విద్యార్థులు పూర్తి విద్యను పొందగలిగేలా ఆయన గురుకుల విద్యా వ్యవస్థను ప్రోత్సహించారు. ఆచరణాత్మక వేదాంతం గురించి అవగాహనను వ్యాప్తి చేశారు. విద్యార్థుల మెరుగైన భవిష్యత్తు కోసం ఆయన జీవితాంతం కృషి చేశారు. ఆయన విద్యా విధానం నేటికీ సందర్భోచితంగా ఉంది.