Saturday, November 15, 2025
Homeహెల్త్Digestive cancer: కమ్మేస్తున్న జీర్ణవ్యవస్థ క్యాన్సర్‌ ముప్పు: ఆసియా, భారత్‌లపై తీవ్ర ప్రభావం!

Digestive cancer: కమ్మేస్తున్న జీర్ణవ్యవస్థ క్యాన్సర్‌ ముప్పు: ఆసియా, భారత్‌లపై తీవ్ర ప్రభావం!

Cancer threat: ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న క్యాన్సర్లలో, ఇప్పుడు జీర్ణవ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్‌లు భారీగా పెరుగుతున్నాయని ఓ తాజా ప్రపంచ అధ్యయనం తీవ్రంగా హెచ్చరిస్తోంది. 2008 నుంచి 2017 మధ్య జన్మించిన ప్రపంచవ్యాప్తంగా కోటిన్నరకు పైగా వ్యక్తులు తమ జీవితకాలంలో జీర్ణవ్యవస్థ క్యాన్సర్‌ బారినపడే ప్రమాదం ఉందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ఇది కేవలం ఒక హెచ్చరిక మాత్రమే కాదు, ప్రభుత్వాలు, వైద్యరంగం, ప్రజలు తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.

- Advertisement -

ఆసియా కేంద్రంగా విస్తరిస్తున్న కేసులు:

ఈ జీర్ణవ్యవస్థ క్యాన్సర్‌లలో మూడింట రెండు వంతుల కేసులు ఆసియా ఖండంలోనే నమోదయ్యే అవకాశం ఉందని పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా భారత్‌, చైనా దేశాలు అత్యధికంగా ప్రభావితమవుతాయని, ఈ రెండు దేశాల్లోనే దాదాపు 65 లక్షల కేసులు సంభవించవచ్చని అంచనా వేయబడింది. ఆసియాలో మొత్తం కోటి ఆరు లక్షల వరకు జీర్ణవ్యవస్థ క్యాన్సర్‌ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.

అమెరికా, ఆఫ్రికా ఖండాల్లో కూడా ఈ వ్యాధి ప్రభావం కనిపించినా, ప్రధానంగా ఆసియాలోనే ముప్పు ఎక్కువగా ఉందని వివరించారు. ఈ అధ్యయనం 185 దేశాల్లో 2008-2017 మధ్య జన్మించిన ప్రజల్లో జీర్ణవ్యవస్థ క్యాన్సర్‌ల విస్తృతిని పరిశీలించి, ప్రపంచవ్యాప్తంగా 1.56 కోట్ల కేసులు నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది.

ముందస్తు నిర్ధారణతో 75% కేసుల నివారణ సాధ్యం!

ఈ నివేదిక ఆందోళన కలిగించినప్పటికీ, ఒక ఆశాజనకమైన విషయాన్ని కూడా తెలియజేస్తోంది. సరైన చికిత్సలు, ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ క్యాన్సర్‌లలో 75 శాతం వరకు నివారించవచ్చని నిపుణుల అభిప్రాయపడుతున్నారు. వ్యాధిని ముందే గుర్తించి చికిత్సలు చేపడితే, జీర్ణవ్యవస్థ క్యాన్సర్‌ ముప్పును గణనీయంగా తగ్గించవచ్చని వారు సూచిస్తున్నారు. దీనికి సమయానికి స్క్రీనింగ్, రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం చాలా కీలకం.

తక్షణ చర్యలు అవసరం:

“ఆరోగ్యమే మహాభాగ్యం” అన్న నానుడిని ఎప్పటికీ మర్చిపోకూడదు. కడుపునొప్పి, అజీర్తి, బలహీనత వంటి చిన్న లక్షణాలను కూడా నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే వైద్యుడిని సంప్రదించాలి. వ్యాధి నివారణే మేలైన చికిత్స. ఈ పెను ముప్పు నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వాలు ప్రజారోగ్య కార్యక్రమాలను విస్తృతం చేయాలి, ప్రజలు తమ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. జీర్ణవ్యవస్థ క్యాన్సర్‌ల పట్ల అవగాహన పెంచుకొని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ పెను ఉపద్రవం నుండి బయటపడవచ్చు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad