Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Modi Japan Tour: టోక్యోలో మోదీ మంత్రం..పెట్టుబడుల ప్రవాహానికి పచ్చజెండా!

Modi Japan Tour: టోక్యోలో మోదీ మంత్రం..పెట్టుబడుల ప్రవాహానికి పచ్చజెండా!

India-Japan economic cooperation: తూర్పు ఆసియాలో భారత దౌత్యనీతి కొత్త పుంతలు తొక్కుతోంది. నాలుగు రోజుల కీలక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ రాజధాని టోక్యోలో అడుగుపెట్టారు. ఏడేళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ పర్యటనకు ఘన స్వాగతం లభించింది. గాయత్రీ మంత్రాలు, భజనలతో ప్రవాస భారతీయులు ఆయనకు ఆత్మీయ ఆహ్వానం పలికారు. ఈ పర్యటన కేవలం స్నేహపూర్వక భేటీకే పరిమితం కాకుండా, ఇరు దేశాల ఆర్థిక బంధాన్ని కొత్త శిఖరాలకు చేర్చే లక్ష్యంతో సాగుతోంది. 

- Advertisement -

పెట్టుబడులే లక్ష్యంగా ఎకనామిక్ ఫోరమ్:

టోక్యోలో అడుగుపెట్టిన వెంటనే ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో కలిసి ప్రతిష్ఠాత్మకమైన “ఇండియా-జపాన్ ఎకనామిక్ ఫోరమ్”లో పాల్గొన్నారు. ఈ సమావేశం ఇరు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా జరిగింది. బహుళ రంగాల్లో, ముఖ్యంగా తయారీ, సాంకేతికత, మౌలిక సదుపాయాల కల్పన వంటి కీలక రంగాల్లో భారీగా పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రధాని మోదీ దృష్టి సారించారు. జపాన్ పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, భారత్‌లో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను, ప్రభుత్వం కల్పిస్తున్న సౌలభ్యాలను వివరించారు.

వార్షిక శిఖరాగ్ర సదస్సు – ద్వైపాక్షిక చర్చలు:

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన జపాన్ పర్యటనలో భాగంగా, జపాన్ ప్రధాని షిగెరు ఇషిబాతో వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. ఈ భేటీలో కేవలం ఆర్థిక అంశాలే కాకుండా, రక్షణ, భద్రత, వ్యూహాత్మక భాగస్వామ్యం వంటి అంశాలపై కూడా లోతైన చర్చలు జరగనున్నాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, చైనా దూకుడు వంటి ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు కూడా ఇరు నేతల మధ్య ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.

పర్యటనపై ప్రధాని ఆశాభావం:

జపాన్ పర్యటనకు బయల్దేరే ముందు ప్రధాని మోదీ ‘X’ వేదికగా తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. “జపాన్ ప్రధాని ఇషిబా, ఇతర మిత్రులను కలిసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ పర్యటన ఇప్పటికే ఉన్న మన బలమైన భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేయడానికి, సహకారానికి కొత్త మార్గాలను అన్వేషించడానికి ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది,” అని ఆయన పేర్కొన్నారు.

జపాన్ నుంచి నేరుగా చైనాకు:

ఆగస్టు 30 వరకు జపాన్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ, తన పర్యటన ముగించుకుని అక్కడి నుంచి నేరుగా చైనాకు వెళ్లనున్నారు. అక్కడ జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad