Friday, September 20, 2024
Homeనేషనల్BBC: బీబీసీ ఢిల్లీ, ముంబై ఆఫీసుల్లో ఐటీ అధికారులు

BBC: బీబీసీ ఢిల్లీ, ముంబై ఆఫీసుల్లో ఐటీ అధికారులు

ఢిల్లీ, ముంబైల్లోని బీబీసీ ఆఫీసుల్లో ఐటీ అధికారులు సర్వే చేపట్టారు. అయితే ఇవి ఆదాయపు పన్ను సోదాలు కాదని కేవలం సర్వేనే అంటూ ఐటీ అధికారులు తేల్చి చెప్పారు. పన్నులు చెల్లించటంలో జరిగిన తేడాల నేపథ్యంలోనే ఈ సర్వే చేపట్టినట్టు తెలిపారు. కొన్ని సెల్ఫోన్స్, ల్యాప్ టాప్స్ సీజ్ చేశారు.

- Advertisement -

2002 గుజరాత్ అల్లర్లపై బీబీసీ టెలికాస్ట్ చేసిన డాక్యుమెంటరీ వివాదాస్పదం అయిన నేపథ్యంలోనే ఈ దాడులు జరుగుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తం 20 మంది ట్యాక్స్ ఆఫీసర్లు ఈ సర్వేలో పాల్గొంటున్నారు. కొన్ని డాక్యుమెంట్లను కూడా సీజ్ చేశారు. బీబీసీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి బ్యాలెన్స్ షీట్, అకౌంట్స్ వివరాలను కూడా వారు వాకబు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News