Sunday, October 6, 2024
Homeనేషనల్Covid deaths: మహారాష్ట్రలో మృత్యు ఘోష, 24 గంటల్లో 9 కోవిడ్ మరణాలు

Covid deaths: మహారాష్ట్రలో మృత్యు ఘోష, 24 గంటల్లో 9 కోవిడ్ మరణాలు

మహారాష్ట్రలో కోవిడ్ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. ఈరోజు ఒక్కరోజే కొత్తగా 1,115 పాజిటివ్ కేసులు నమోదుకాగా, గత 24 గంటల్లో ఏకంగా 9 మంది మరణించారు.  రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 5,421 యాక్టివ్ కేసులున్నాయి.  వీటిలో అత్యధిక కేసులు ముంబై మహానగరంలోనివే.  రాజధాని ముంబైలో పాజిటివిటీ రేటు 14.57 శాతంగా ఉంది.  కొత్త వేరియంట్ల బెడదతో ఇప్పటికే దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య బాగా పెరుగుతోంది.  మరోవైపు XBB.1.16 వంటి ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు ఎక్కువగా నమోదవుతున్నాయి.  మరో 12 రోజులపాటు ఇలాగే కొత్త పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగి ఆతరువాత ఇది తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News