Tuesday, July 2, 2024
Homeనేషనల్Delhi: విపక్ష ఎంపీల మూకుమ్మడి పాదయాత్ర

Delhi: విపక్ష ఎంపీల మూకుమ్మడి పాదయాత్ర

దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ ధర్మాగ్రహానికి సిద్ధమై, రాష్ట్రపతి భవన్ వరకు పాదయాత్ర చేయనున్నాయి.  పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ వరకూ ఈ పాదయాత్ర జరుగనుంది.  కేంద్ర ప్రభుత్వం విపక్ష పార్టీలను వేధిస్తున్న తీరును ప్రజలకు వివరించేందుకు కాంగ్రెస్ నేతృత్వంలో ఈ మార్చ్ నిర్వహిస్తున్నారు. రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడటంతో రెచ్చిపోతున్న కాంగ్రెస్ ఈమేరకు తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కేందుకు విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు పాదయాత్రను నిర్వహిస్తోంది.

- Advertisement -

మోడీ అనే సామాజిక వర్గాన్ని యావత్తు దొంగలని కించపరిచిన రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ భగ్గుమంటోంది.  ఇది బీసీలను అవమానించటమేనని మోడీ సామాజిక వర్గానికి చెందిన బీజేపీ నేతలంతా మండిపడుతున్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News