Friday, September 20, 2024
Homeనేషనల్Delhi: శివసేన బాణం గుర్తు షిండే వర్గానిదే.. ప్రజాస్వామ్యం ఖూనీ అంటున్న ఉద్ధవ్

Delhi: శివసేన బాణం గుర్తు షిండే వర్గానిదే.. ప్రజాస్వామ్యం ఖూనీ అంటున్న ఉద్ధవ్

ఎట్టకేలకు 8 నెలల పోరాటం తరువాత మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే తన శివసేన పార్టీ బాణం గుర్తును సొంతం చేసుకున్నారు. దీంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గంపై షిండేదే పై చేయి అయింది. అయితే ఎన్నికల కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయంపై బాల్ ఠాక్రే కుమారుడు మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఆయన వ్యాఖ్యానించారు. 1966లో బాల్ ఠాక్రే శివసేనను స్థాపించగా గతేడాది షిండే వర్గం తిరుగుబాటు చేసి పార్టీ ఎమ్మెల్యేలను అత్యధిక సంఖ్యలో తనవైపు తిప్పుకుని, అధికారం కైవసం చేసుకుని చివరికి పార్టీ గుర్తును కూడా సొంతం చేసుకోవటం విశేషం. ఈసీ నిర్ణయంతో ఉద్ధవ్ పై షిండేదే పైచేయిగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News