ఎట్టకేలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్ ఈడీ సమన్లు అందుకున్నారు. ఇప్పటికే ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ విషయంలో నియమ నిబంధలను పూర్తిగా అతిక్రమించారన్న ఆరోపణలతో కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు జారే చేయగా తాజాగా మరో శ్రీముఖం కూడా తోడైందన్నమాట. అయితే గతంలో ఎక్సైజ్ పాలసీపై తనకు ఈడీ జారీ చేసిన సమన్లు కేవలం రాజకీయ ఉద్దేశంతో, కక్షసాధింపుతో కూడుకున్నదని కేజ్రీ రచ్చ చేశారు.