Saturday, May 4, 2024
Homeనేషనల్ECI: ప్రతి రోజూ రూ.100 కోట్లు జప్తు

ECI: ప్రతి రోజూ రూ.100 కోట్లు జప్తు

4,650 కోట్ల సొత్తు స్వాధీనం

దేశంలో 75 ఏళ్ల లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2024 సార్వత్రిక ఎన్నికల సందర్బంగా అత్యధిక మొత్తంలో రూ.4,650 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకొని ఈసీఐ రికార్డు నెలకొల్పింది. 18వ లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ శుక్రవారం ప్రారంభం కావడానికి ముందే డబ్బు శక్తిపై ECI యొక్క దృఢమైన పోరాటంలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు రికార్డు స్థాయిలో రూ.4650 కోట్లకు పైగా స్వాధీనం చేసుకున్నాయి. 2019 లో జరిగిన మొత్తం లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో స్వాదీనం చేసుకున్న మొత్తం రూ. 3,475 కోట్లకు పైగా ఈ ఎన్నికల మొదటి దశలోనే జప్తు చేయడం గమనార్హం. డ్రగ్స్ మరియు మాదక ద్రవ్యాల పై కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది అనడానికి స్వాదీనం చేసుకున్న మొత్తం సొత్తులో 45% డ్రగ్స్ మరియు మాదక ద్రవ్యాలు ఉండటమే నిదర్శనం. సమగ్ర ప్రణాళిక, సహకారం, ఏజెన్సీల ఏకీకృత నిరోధక చర్యలు, చురుకైన పౌరుల భాగస్వామ్యం మరియు సాంకేతికత సహకారమే ఇంత పెద్ద మొత్తంలో సొత్తును స్వాదీనం చేసుకోవడం సాధ్యమైంది.

- Advertisement -

నల్లధనాన్ని ఉపయోగించడం, పైగా రాజకీయ ఫైనాన్సింగ్ మరియు దాని ఖచ్చితమైన బహిర్గతం, నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాలలో మరింత వనరులతో కూడిన పార్టీ లేదా అభ్యర్థికి అనుకూలంగా ఉండే స్థాయికి ఆటంకం కలిగించవచ్చు. ECI సంకల్పించినట్లుగా లోక్‌సభ ఎన్నికలను ప్రేరేపణలు మరియు ఎన్నికల అవకతవకలకు తావు లేకుండా నిర్వహించేందుకు జప్తులు/స్వాదీనం చేయడం అనేవి కీలకమైన భాగం. గత నెలలో ఎన్నికల షెడ్యూలును ప్రకటిస్తూ CEC శ్రీ రాజీవ్ కుమార్ మనీ పవర్‌ను ‘4M’ సవాళ్లలో ఒకటిగా నొక్కిచెప్పారు. ఏప్రిల్ 12న CEC శ్రీ రాజీవ్ కుమార్ నేతృత్వంలో EC లు శ్రీ జ్ఞానేష్ కుమార్ మరియు శ్రీ సుఖ్‌బీర్ సింగ్ సంధుతో కలిసి ఏప్రిల్ 19న జరుగనున్న ఎన్నికలు పర్యవేక్షించేందుకు ఫేజ్-1లో నియమించబడిన కేంద్ర పరిశీలకులందరితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ చర్చల్లో భాగంగా ప్రేరేపణ-రహిత ఎన్నికల ప్రక్రియను నిర్ధారించడానికి పర్యవేక్షణ మరియు తనిఖీలపై ప్రత్యేక దృష్టి ఉంటుందన్నారు.

ముఖ్యంగా చిన్న మరియు తక్కువ వనరులు కలిగిన పార్టీలకు ఎన్నికలు అనుకూలంగా ఉండే విదంగా ఎన్నికల్లో ప్రేరణలను పర్యవేక్షించడానికి మరియు ఎన్నికల అక్రమాలను అరికట్టడానికి జప్తులు / స్వాదీనాల్లో పెరుదల అనేది ECI యొక్క తిరుగులేని నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయి.

తమిళనాడులోని నీలగిరిలో విధి నిర్వహణలో అలసత్వం మరియు ఓ ప్రముఖ నాయకుడిని లక్ష్యంగా చేసుకుని ఆయన కాన్వాయ్ పై దాడులు నిర్వహించిన ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాన్ని ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. అదేవిధంగా ఒక రాష్ట్రానికి చెందిన సీఎం కాన్వాయ్‌లోని వాహనాలను, మరో రాష్ట్రంలోని డిప్యుటీ సీఎం వాహనాన్ని కూడా అధికారులు తనిఖీ చేశారు. ప్రచారంలో రాజకీయ నాయకులతో కుమ్ముక్కై, ప్రవర్తనా నియమావళిని మరియు కమిషన్ సూచనలను ఉల్లంఘించిన సుమారు 106 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కూడా కమిషన్ కఠిన చర్యలు తీసుకుంది.

పార్లమెంటరీ ఎన్నికల ప్రకటన సందర్భంగా విలేకరుల సమావేశంలో సీఈసీ శ్రీ రాజీవ్ కుమార్ తన ప్రెజెంటేషన్‌లో నాన్ షెడ్యూల్డ్ విమానాలు మరియు హెలికాప్టర్‌ల విషయంలో బీసీఏఎస్ సూచనలను ఖచ్చితంగా పాటించాలని ఆదాయపు పన్ను, విమానాశ్రయ అధికారులు మరియు సంబంధిత జిల్లాల అధికారులు, సరిహద్దు ఏజెన్సీలకు స్పష్టం చేశారు. అంతర్జాతీయ చెక్‌పోస్టులు మరియు గోడౌన్ లను GST అధికారులు నిశితంగా పర్యవేక్షించాలని, ముఖ్యంగా ఉచితాలను నిల్వ చేయడానికి ఉద్దేశించిన తాత్కాలిక గోడౌన్‌లను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. అన్ని రవాణా మార్గాలపైనా బహుముఖ నిఘా ఉంటుందని కమిషన్ సమీక్షల సందర్భంగా ఎప్పుడూ చెబుతూ వస్తోంది. రోడ్డు మార్గాల్లో చెక్‌పోస్టులు, నకాస్‌ లు, కోస్టల్‌ రూట్లలో కోస్ట్‌గార్డు, హెలికాప్టర్లు, షెడ్యూల్ లో లేని విమానాలను తనిఖీ చేసేందుకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో పాటు సంబంధిత శాఖల అధికారులను రంగంలోకి దించడం జరిగింది.

13.04.2024 నాటికి రాష్ట్రం/యూటీ వారీగా మరియు కేటగిరీల వారీగా జప్తులు/స్వాదీనం వివరాలు అనుబంధం-A లో తెలుపబడ్డాయి.

ఇంత పెద్ద మొత్తంలో జప్తు/స్వాదీనాలు ఈ క్రింద తెల్పిన విదంగా సాధ్యమైంది…..

1)ఎలక్షన్ సీజర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ESMS)- సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా కలుగులన్నీ బద్దలు కొట్టడం మరియు అన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలను ఒకే వేదికపైకి తీసుకురావడం అనేది గేమ్ చేంజర్ గా మారింది. నిఘా వ్యవస్థలో సాంకేతికతను ఉపయోగించి భారత ఎన్నికల సంఘం తీసుకువచ్చిన ESMS నగదు ప్రవాహాన్ని అడ్డుకునే చర్యలకు ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తోంది. మూడో దశ అసెంబ్లీ ఎన్నికలలో రియల్ టైం లో తనిఖీలు, జప్తు వివరాలను రిపోర్టు చేయడం, అనవసర తనిఖీలు నివారించడంలో ESMS ఎంతో ప్రభావవంతంగా పని చేసింది.

ESMS పోర్టల్ డిజిటల్ ట్రయల్స్ మరియు జప్తు సమాచారం యొక్క లభ్యతను ఒక్క క్లిక్ తో సంబంధిత అధికారుల ముందుంచడం ద్వారా అన్ని నియంత్రణ స్థాయిలలో సమయానుకూల చర్యలకు అవకాశం కల్పిస్తోంది. ఇప్పటివరకూ ఉన్న సమాచారం మేరకు వివిధ ఏజెన్సీలకు చెందిన 6,398 జిల్లా నోడల్ అధికారులు, 734 రాష్ట్ర నోడల్ అధికారులు, 59,000 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు (FS) మరియు స్టాటిక్స్ సర్వైలెన్స్ టీమ్‌లు (SST) ESMS ప్లాట్‌ఫారమ్‌ ద్వారా రియల్ టైం పర్యవేక్షణలో నిమగ్నమై ఉన్నారు. నోడల్ అధికారులందరూ ESMSని ఉపయోగించే వివిధ అంశాలపై శిక్షణ పొందారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ వ్యవస్థ ద్వారా రూ.2,014.26 కోట్లు పట్టుబడగా, అంతకు ముందు జరిగిన ఎన్నికలలో రూ.239.35 కోట్లు పట్టుబడటం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల చివరి రౌండ్‌లో విజయవంతమైన అమలు ద్వారా క్షేత్ర స్థాయి నుండి వచ్చిన అభిప్రాయాలతో ప్రస్తుత ఎన్నికలలో అమలు చేయడానికి ముందుగా సమీక్ష చేసి మరింత పతిష్టపరచడం జరిగింది.

  1. ఖచ్చితమైన మరియు సమగ్రమైన ప్రణాళిక, అత్యధిక సంఖ్యలో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల ప్రమేయం: ఏజెన్సీల మధ్య సహకార ప్రయత్నం కోసం కేంద్రం మరియు రాష్ట్రాల నుండి అత్యధిక సంఖ్యలో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు సమీకరించబడ్డాయి. నగదు, ప్రెషస్ మెటల్స్, లిక్కర్, నార్కొటిక్స్, ఫ్రీబీస్ నియంత్రణకు సంబందిత శాఖలను ఎన్ఫోర్సుమెంట్ ఏజన్సీలుగా నియమించడంమే కాకుండా సరిహద్దు మరియు ఇతర ఏజన్సీలను కూడా ఇందులో భాగస్వామ్యులను చేయడం జరిగింది.
  2. ఎన్నికల ప్రకటనకు కొన్ని నెలల ముందు నుంచి మరీ ముఖ్యంగా జనవరి 2024 నుండి మరింత తీవ్రంగా, ఎన్నికల సంఘంలోని సీనియర్ అధికారులు ప్రతి రాష్ట్రం మరియు కేంద్రపాలిత ప్రాంతాలను సందర్శించి ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని ఎదుర్కోవాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఇంకా, జిల్లాలను క్షుణ్ణంగా సమీక్షించారు మరియు వారి పనితీరును అంచనా వేయడానికి మరియు ఎన్నికల సమయంలో ఆర్థిక వనరుల దుర్వినియోగంపై అధిక నిఘాను ప్రోత్సహించడానికి చీఫ్ సెక్రటరీలు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGPలు) మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల అధిపతులతో చర్చలు జరిగాయి. రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎన్నికల సందర్శనల సమయంలో వివిధ మార్గాల్లో-రోడ్డు, రైలు, సముద్రం మరియు వాయు మార్గాల ద్వారా తనిఖీ చేయడంలో సంబంధిత ఏజెన్సీలతో కూడిన ఉమ్మడి బృందాల ప్రాముఖ్యతను కూడా కమిషన్ నొక్కి చెప్పింది. ఫలితంగా, అధికారిక ప్రకటనకు ముందు జనవరి మరియు ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా మరో రూ.7,502 కోట్ల నగదు, మద్యం, డ్రగ్స్, విలువైన లోహాల మరియు ఉచితాల రూపంలో జప్తు జరిగింది. ఎన్నికల సమయానికి ఇంకా ఆరు వారాలు మిగిలి ఉండగానే ఇప్పటివరకు మొత్తం జప్తు రూ. 12,000 కోట్లకు చేరుకుంది.

4.సమాజంలో మాదకద్రవ్యాల ముప్పుపై పెరిగిన దృష్టి: ముఖ్యంగా, 2024 జనవరి మరియు ఫిబ్రవరిలో జరిగిన మొత్తం జప్తుల్లో దాదాపు 75% మాదకద్రవ్యాల స్వాధీనంపై గణనీయమైన దృష్టి పెట్టారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్ నోడల్ ఏజెన్సీలను సందర్శించిన సమయంలో డ్రగ్స్ మరియు మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలలో ఏజెన్సీల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. అక్రమ సొమ్ము మరియు మాదక ద్రవ్యాలు ఎన్నికలను ప్రభావితం చేయడంతో పాటూ సమాజానికి ముఖ్యంగా యువతకు హాని కలిగించే తీవ్రమైన ప్రమాదాన్ని ఆయన హైలైట్ చేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు కీలకమైన మార్గాలు మరియు కారిడార్‌లను గుర్తించడానికి మరియు వాటిని సమర్థవంతంగా అరికట్టడానికి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టరేట్ జనరల్ మరియు దాని సీనియర్ అధికారుల సహకారంతో కమిషన్ పని చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా, గుజరాత్, పంజాబ్, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర మరియు మిజోరాం వంటి రాష్ట్రాలలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు సమయంలో, రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికల సమయంలో గణనీయమైన జప్తులు జరిగాయి.

  1. వ్యయ సున్నిత నియోజకవర్గాల గుర్తింపు: ఎన్నికలలో నగదు ప్రవాహాన్ని ప్రభావవంతంగా అరికట్టడంలో భాగంగా 123 పార్లమెంటరీ నియోజకవర్గాలను వ్యయ సున్నిత నియోజకవర్గాలుగా గుర్తించడం జరిగింది. ఈ నియోజకవర్గాలు మునుపటి ఎన్నికలలో పెద్ద ఎత్తున నగదు పంపిణీ చరిత్రను కలిగి ఉన్నాయి లేదా డ్రగ్స్, నగదు మరియు మద్యం ప్రవాహ మార్గాలుగా అంతర్-రాష్ట్ర మరియు అంతర్జాతీయ సరిహద్దులను కలిగి ఉన్నాయి.

6.వ్యయ పరిశీలకుల విస్తరణ: న్యాయమైన మరియు ప్రేరేపిత రహిత ఎన్నికల కోసం వ్యయ పరిశీలకులుగా నియమించబడిన సీనియర్ అధికారులు కమిషన్ యొక్క కళ్ళు మరియు చెవులుగా పనిచేస్తున్నారు. పార్లమెంటరీ నియోజకవర్గాలకు మొత్తం 656 మంది వ్యయ పరిశీలకులను కేటాయించగా, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ మరియు సిక్కింలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 125 మందిని నియమించారు. ఎన్నికల ప్రక్రియలలో అనుభవం మరియు అద్భుతమైన ట్రాక్ రికార్డ్‌ కలిగిన ‘ప్రత్యేక’ వ్యయ పరిశీలకులు రాష్ట్రాలు/UTలలో కూడా నియమించబడ్డారు.
7. cVigil ఉపయోగం: కమీషన్ యొక్క cVigil యాప్ కూడా పౌరుల నుండి నేరుగా అన్ని రకాల ఉచితాల పంపిణీపై ఫిర్యాదుల ద్వారా వ్యయ పర్యవేక్షణ ప్రక్రియను బలోపేతం చేసింది. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించినప్పటి నుంచి నగదు, మద్యం, ఉచిత పంపిణీకి సంబంధించి మొత్తం 3,262 ఫిర్యాదులు అందాయి.

  1. పౌరులకు వేధింపులు లేవు: ప్రస్తుత ఎన్నికల ప్రారంభంలో క్షేత్ర స్థాయి బృందాల అనవసర తనిఖీలతో పర్యాటకులు ఇబ్బందులకు గురవుతున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కమిషన్, పర్యాటకులు మరియు పౌరులను తనిఖీ చేసేటప్పుడు జాగ్రత్తగా మరియు మర్యాదపూర్వకంగా వ్యవహరించాల్సిన అవసరం గురించి అన్ని ప్రధాన ఎన్నికల అధికారుల (CEO)లకు వెంటనే సూచనలు జారీ చేసింది. అదనంగా జప్తులకు సంబంధించిన ఫిర్యాదుల సత్వర పరిష్కారం కోసం నియమించబడిన ప్రదేశాలలో రోజువారీ విచారణలు నిర్వహించడానికి ‘డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీలు (DGC)’ని ఏర్పాటు చేయాలని కమిషన్ ఆదేశించింది. ఈ కమిటీలు సమర్థవంతంగా పనిచేసేలా చూడాలని సీఈఓలు, డీఈఓలను ఆదేశించడం జరిగింది. ఈ చర్యలు సమగ్ర వ్యయ పర్యవేక్షణ ప్రక్రియకు మూలస్తంభంగా పనిచేస్తున్నాయి. ఫలితంగా ప్రజలకు కనీస అసౌకర్యాన్ని కల్పించకపోవడమే కాకుండా జప్తులు/స్వాదీనాల్లో పెరుగుదలకు కారణమయ్యాయి. రాబోయే రోజుల్లో ప్రచారాన్ని తీవ్రతరం చేయడంతో పాటు కమిషన్ తన నిబద్ధతకు అనుగుణంగా ప్రేరేపిత రహిత ఎన్నికల ప్రక్రియను నిర్ధారించడానికి దాని నిఘాను మరింత పెంచడానికి సిద్ధంగా ఉంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News