Saturday, November 15, 2025
Homeనేషనల్Jharkhand Floods: దేశభక్తికి ప్రకృతి సవాల్.. తలొంచని భారతీయులు!

Jharkhand Floods: దేశభక్తికి ప్రకృతి సవాల్.. తలొంచని భారతీయులు!

Jharkhand Floods Flag Hoisting: చుట్టూ వరద నీరు.. కళ్ల ముందే కకావికలమైన జనజీవనం.. అయినా వారి గుండెల్లోని దేశభక్తి జ్వాల ఆరలేదు. ప్రకృతి సవాలుకు ఎదురొడ్డి, ఛాతీ లోతు వరద నీటిలో నిలబడి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. జాతీయ గీతం ఆలపిస్తున్నప్పుడు వారి కంఠంలో కనిపించిన గర్వం, వరద హోరును సైతం మించిపోయింది. ఇంతకీ, ఈ అపురూప దృశ్యాలు ఎక్కడ ఆవిష్కృతమయ్యాయి..? ఆ ఉపాధ్యాయులు, విద్యార్థులు అంతటి సాహసం చేయడానికి ప్రేరేపించిన శక్తి ఏది..? విపత్తు వేళ వెల్లువెత్తిన ఈ దేశభక్తికి సంబంధించిన పూర్తి కథనం మీకోసం..

- Advertisement -

దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. “హిమగిరి శిఖరాల నుండి హిందూ మహాసముద్రం వరకు మువ్వన్నెల పతాకం విజయోత్సాహంతో రెపరెపలాడింది.” అయితే, కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ వేడుకలు దేశభక్తికి నిలువుటద్దంగా, స్ఫూర్తికి ప్రతిరూపంగా నిలిచాయి. భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ జిల్లాలో చోటుచేసుకున్న దృశ్యాలు ప్రతి భారతీయుడి హృదయాన్ని గర్వంతో ఉప్పొంగేలా చేస్తున్నాయి.

ఛాతీ లోతు నీటిలో జెండా వందనం : సాహిబ్‌గంజ్‌లోని దియారా ప్రాంతం వరద నీటిలో పూర్తిగా మునిగిపోయింది. దీంతో ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. కానీ, సదర్ బ్లాక్‌లోని కిషన్ ప్రసాద్ పంచాయతీ, మధ్య విద్యాలయ పాఠశాల ఉపాధ్యాయులు స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరపకుండా ఉండలేకపోయారు. పాఠశాల ఆవరణమంతా ఛాతీ లోతు నీటితో నిండి ఉన్నా, వారు వెనకడుగు వేయలేదు.

ALSO READ:https://teluguprabha.net/national-news/swachh-vidyalaya-puraskar-2025-26-application-guidelines/

విద్యార్థులను సురక్షితమైన, నీరు లేని ప్రాంతంలో నిలబెట్టి, ఉపాధ్యాయులు మాత్రం ఆ వరద నీటిలోకి దిగారు. నీటి మధ్యలోనే జెండా స్తంభం వద్దకు చేరుకుని, జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం, నీటిలోనే నిలబడి జాతీయ గీతాన్ని గంభీరంగా ఆలపించి, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. “ఒక భారతీయుడిగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోకుండా ఉండటం అసాధ్యం. కాస్త ఇబ్బంది అయినా, ఈ పవిత్ర కర్తవ్యాన్ని నిర్వర్తించాం” అని ఉపాధ్యాయుడు రాజీవ్ గద్గద స్వరంతో అన్నారు. ఇదే బ్లాక్‌లోని ఖోక్లా సింగ్ టొలా రాంపుర్‌లో సైతం, ఇన్‌ఛార్జ్ ఉపాధ్యాయుడు శంభూ సింగ్ పడవలో పాఠశాలకు చేరుకుని, విద్యార్థులను కూడా పడవపైనే తీసుకొచ్చి జెండా వందనం నిర్వహించడం వారి అకుంఠిత దీక్షకు నిదర్శనం.

ALSO READ:https://teluguprabha.net/national-news/mallikarjun-kharge-criticizes-bjp-independence-day-2025/

ఉత్తరాఖండ్‌లోనూ అదే స్ఫూర్తి : ఇటీవల వరద విలయతాండవం చేసి, కోలుకుంటున్న ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ, ధారలీ ప్రాంతంలోనూ దేశభక్తి వెల్లువెత్తింది. విపత్తు నుంచి ఇంకా తేరుకోకపోయినా, స్థానిక ప్రజలు స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. సహాయక చర్యల్లో నిమగ్నమైన ఐటీబీపీ, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బలగాలు ఈ వేడుకల్లో పాల్గొని, జెండాకు వందనం సమర్పించారు. అనంతరం, వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. ఈ రెండు ఘటనలు, ప్రకృతి ప్రకోపాలు మన సంకల్పాన్ని ఏమాత్రం దెబ్బతీయలేవని నిరూపించాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad