ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓవైపు పార్లమెంట్ ఎన్నికలు తరుముకొస్తుంటే మరోవైపు అయోధ్య రామ మందిర నిర్మాణంతో ఉత్సాహంతో ఉన్న యోగి తమ నెక్ట్స్ టార్గెట్ కాశి, మథురనే అని తేల్చి చెప్పారు. కాశీలోని జ్ఞానవాపి మసీదు నేలమాణిగల్లో ఇప్పటికే నిత్య పూజలు ప్రారంభం కాగా మరోవైపు కృష్ణ జన్మభూమి కూడా త్వరలో కృష్ణుడి గుడి ఆధీనంలోకి రానుందని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.