Sunday, October 6, 2024
Homeనేషనల్Kejri: అందరితోనూ మోడీ సర్కారు గొడవెందుకు పడుతోంది ?

Kejri: అందరితోనూ మోడీ సర్కారు గొడవెందుకు పడుతోంది ?

కేంద్రంలోని బీజేపీ సర్కారు అందరితోనూ నిత్యం గొడవలు పడుతోందంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విలదీస్తున్నారు. అన్ని రాష్ట్రాలు, జడ్జిలు, రైతులు, వ్యాపారులు..ఇలా అన్ని వర్గాల వారితో నిత్యం ఘర్షణ, పోరాట వైఖరినే మోడీ సర్కారు అవలంభిస్తోందంటూ కేజ్రీవాల్ ఆరోపించారు. ఇతరుల పనుల్లో తలదూర్చవద్దని, జోక్యం చేసుకోవద్దని మోడీ సర్కారుకు కేజ్రీ సూచించారు. ఇలా అందరితో ఘర్షణాత్మక వైఖరిని అవలంభిస్తూపోతే దేశం అభివృద్ధి చెందదని ఢిల్లీ సీఎం హెచ్చరించారు. మీ పని మీరు చేసుకుంటూ ఇతరులను తమ పనులు చేసుకోనివ్వాలంటూ ఆయన హితవు పలకటం విశేషం. ఈమేరకు ఘాటైన ఓ ట్వీటును కేజ్రీవాల్ హిందీలో ట్వీటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News