Saturday, October 5, 2024
Homeనేషనల్Lalu: నాన్నను బాగా చూసుకోండి.. లాలూ కుమార్తె ఎమోషనల్ పోస్ట్

Lalu: నాన్నను బాగా చూసుకోండి.. లాలూ కుమార్తె ఎమోషనల్ పోస్ట్

మూత్రపిండాల ఆపరేషన్ తరువాత ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వస్తున్న తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ ను బాగా చూసుకోవాలంటూ లాలూ కుమార్తె చేసిన ఎమోషనల్ పోస్ట్ అందరినీ ఆకుట్టునేలా ఉంది.

- Advertisement -

ఇండియాకు వస్తున్న లాలూను ఆర్జేడీ పార్టీ నేతలు బాగా చూసుకోవాలని లాలూ కుమార్తె రోహిణి ఆచార్య కోరారు.

74 ఏళ్ల రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం సింగపూర్ లో కుమార్తె రోహిణీ ఆచార్య వద్దకు వెళ్లారు. తన కిడ్నీ ఒకటి ఇచ్చిన కుమార్తె రోహిణి తన తండ్రిని కంటికి రెప్పలా కాపాడుకుని ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య స్థితిగతులను పార్టీ నేతల కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. ప్రస్తుతం తండ్రీ, కూతురు ఆరోగ్యంగా ఉండగా లాలూ సింగపూర్ నుంచి ఇంటికి ఈరోజు తిరిగివస్తున్నారు. ఈనేపథ్యంలో తన తండ్రి గురించి ఆరోగ్యం గురించి తాపత్రయ పడుతూ రోహిణీ చేసిన పోస్ట్ అందరినీ కదిలిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News