Saturday, November 15, 2025
Homeనేషనల్GST compensation: మా దగ్గరేం డబ్బుల సూట్‌కేసు లేదు.. జీఎస్టీ నష్టపరిహారంపై నిర్మలా సీతారామన్ ఘాటు...

GST compensation: మా దగ్గరేం డబ్బుల సూట్‌కేసు లేదు.. జీఎస్టీ నష్టపరిహారంపై నిర్మలా సీతారామన్ ఘాటు వ్యాఖ్యలు

Sitharaman on States’ GST Compensation Demands: ఇటీవలి జీఎస్టీ సంస్కరణల కారణంగా తమకు రాబడి తగ్గితే కేంద్రమే నష్టపరిహారం చెల్లించాలంటూ కొన్ని రాష్ట్రాలు చేస్తున్న డిమాండ్లపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఘాటుగా స్పందించారు. పన్ను వసూళ్లలో సామర్థ్యం చూపించకపోతే, పంచిపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఏమీ “పెద్ద డబ్బుల సూట్‌కేసుతో కూర్చోలేదని” ఆమె తేల్చిచెప్పారు.

- Advertisement -

ఎన్‌డీటీవీ ప్రాఫిట్ జీఎస్టీ సదస్సులో పాల్గొన్న ఆమె, ఈ అంశంపై స్పష్టతనిచ్చారు. జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా పన్ను శ్లాబులను నాలుగు నుంచి రెండుకు తగ్గించడంపై జీఎస్టీ కౌన్సిల్‌లో ఏకాభిప్రాయంతోనే నిర్ణయం తీసుకున్నామని ఆమె గుర్తుచేశారు. ఈ సంస్కరణలు ప్రజలకు మేలు చేస్తాయని అన్ని రాష్ట్రాల మంత్రులు అంగీకరించారని, సమావేశంలో ఎలాంటి విభేదాలు రాలేదని తెలిపారు.

ALSO READ: Population Control: “జనాభా నియంత్రణ వద్దు.. సంతానోత్పత్తి రేటు పడిపోతే చాలా కష్టం”

“అయితే, రాబడి తగ్గితే మా పరిస్థితి ఏంటి? ఎవరు రక్షణ కల్పిస్తారు? అన్న చోటే అసలు సమస్య మొదలైంది. నేను ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను. ఈ విషయంలో నేను దాతను, రాష్ట్రాలు గ్రహీతలు కాదు. మనమందరం ఇందులో భాగస్వాములమే,” అని ఆమె అన్నారు.

జూన్ 2022 నుంచే రాష్ట్రాలకు జీఎస్టీ నష్టపరిహారం ఆగిపోయిందని, ప్రస్తుతం వసూలు చేస్తున్న పరిహార సెస్సును కోవిడ్ సమయంలో తీసుకున్న అప్పులు తీర్చడానికే ఉపయోగిస్తున్నామని తెలిపారు. “ఒకవేళ పన్ను వసూళ్లు తగ్గితే, అది రాష్ట్రాలకే కాదు కేంద్రానికి కూడా నష్టమే. కాబట్టి ఇది కేంద్రం వర్సెస్ రాష్ట్రాల సమస్య కాదు. మనమందరం కలిసి పన్ను ఎగవేతను అరికట్టి, వసూళ్ల సామర్థ్యాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. అంతేకానీ, కేంద్రం డబ్బులిస్తుందని ఆశించడం సరికాదు,” అని నిర్మలా సీతారామన్ నొక్కి చెప్పారు.

ALSO READ: Operation Sindoor : ‘ఆపరేషన్ సిందూర్’ విజయం వెనుక ఇస్రో అస్త్రం.. 400 మంది శాస్త్రవేత్తల అహోరాత్ర శ్రమ!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad