Monday, June 9, 2025
Homeనేషనల్Pakistan Terrorism: ఉగ్రవాదానికి ఊతం ఇస్తే పదోన్నతులు, లేదంటే జైలు.. పాక్‌పై శశిథరూర్ ఆగ్రహం

Pakistan Terrorism: ఉగ్రవాదానికి ఊతం ఇస్తే పదోన్నతులు, లేదంటే జైలు.. పాక్‌పై శశిథరూర్ ఆగ్రహం

Osama Bin Laden Shakil Afridi: కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, పాకిస్థాన్‌లో ఉగ్రవాదానికి ప్రోత్సాహం ఇస్తే పదోన్నతులు, న్యాయం కోసం పనిచేస్తే జైలు శిక్ష అనే విధానాన్ని ఎండగట్టారు. అల్‌ఖైదా అధినేత, ప్రపంచంలోనే అత్యంత కరుడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్‌లాడెన్‌ను అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) పట్టుకోవడానికి సహాయం చేసిన వైద్యుడు డాక్టర్ షకీల్ అఫ్రీదీపై పాకిస్థాన్ కఠిన చర్యలు తీసుకోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. షకీల్ అఫ్రీదీని వెంటనే విడుదల చేయాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని శశిథరూర్ డిమాండ్ చేశారు.

- Advertisement -


అమెరికా చట్టసభ సభ్యుడు బ్రాడ్ షెర్మన్, షకీల్ అఫ్రీదీని తక్షణం విడుదల చేయాలని చేసిన డిమాండ్‌ను శశిథరూర్ సమర్థించారు. అలా జరిగితే, 9/11 దాడులు, ముంబయి ఉగ్రదాడుల వంటి ఘటనల బాధితులకు న్యాయం జరిగే దిశగా కీలక ముందడుగు పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా శశిథరూర్ పంచుకున్నారు.


బ్రాడ్ షెర్మన్ డిమాండ్‌ను మేము స్వాగతిస్తున్నాం. ఒసామా బిన్‌లాడెన్‌కు పాకిస్థాన్ ఆశ్రయం కల్పించింది. అతని ఆచూకీని సీఐఏకు తెలియజేసినందుకు డాక్టర్ షకీల్ అఫ్రీదీని అక్రమంగా అరెస్టు చేసి, చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఉగ్రవాదానికి ప్రోత్సాహం ఇస్తే అవార్డులు, న్యాయం కోసం నిలబడితే శిక్షలు—ఇదీ పాకిస్థాన్ విధానం!” అని శశిథరూర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


షకీల్ అఫ్రీదీ ఎవరు?


2011లో అమెరికా సీఐఏ, ఒసామా బిన్‌లాడెన్‌ను పాకిస్థాన్‌లోని అబొట్టాబాద్ మిలిటరీ కంటోన్మెంట్ శివార్లలో గుర్తించి హతమార్చింది. ఈ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించిన డాక్టర్ షకీల్ అఫ్రీదీ, బిన్‌లాడెన్ కుటుంబ సభ్యుల డీఎన్‌ఏ నమూనాలను సేకరించేందుకు సీఐఏ నిర్వహించిన పోలియో టీకా కార్యక్రమంలో సహకరించారు. ఈ సహాయం కారణంగా పాకిస్థాన్ అధికారులు ఆయనను 2012లో అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయనకు 33 ఏళ్ల జైలు శిక్ష విధించి, ఆయన జైలులోనే ఉన్నారు.


పాక్ సైన్యాధ్యక్షుడికి పదోన్నతిపై విమర్శలు…


ఇటీవల పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ ఆసిం మునీర్‌ను ఫీల్డ్ మార్షల్‌గా పదోన్నతి చేస్తూ అత్యున్నత సైనిక హోదా కల్పించారు. ఈ నిర్ణయాన్ని శశిథరూర్ పరోక్షంగా విమర్శించారు. “ఉగ్రవాదానికి సహకరిస్తే పదోన్నతులు, న్యాయం కోసం నిలబడితే శిక్షలు” అని ఆయన సూచనాత్మకంగా వ్యాఖ్యానించారు.
శశిథరూర్ నేతృత్వంలోని అఖిలపక్ష కమిటీ, ఆపరేషన్ సిందూర్ గురించి చర్చించేందుకు అమెరికా వెళ్లిన సందర్భంలో బ్రాడ్ షెర్మన్ షకీల్ అఫ్రీదీ ప్రస్తావన తీసుకురాగా, ఈ విషయంపై శశిథరూర్ స్పందించారు. ఈ సంఘటన పాకిస్థాన్ ఉగ్రవాదానికి సంబంధించిన వైఖరిపై మరోసారి చర్చకు దారితీసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News