PM Modi Slams Congress Over Emergency: దివంగత ప్రధాని ఇందిరా గాంధీదేశంలో ఎమర్జెన్సీ విధించి నేటితో 50 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ప్రధాని మోదీ సంచలన పోస్ట్ చేశారు. ఎమర్జెన్సీని ఏ భారతీయుడు మరిచిపోడని తెలిపారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ చీకటి అధ్యాయమని పేర్కొన్నారు. ప్రజలు ఈ రోజును ‘సంవిధాన్ హత్యా దివస్గా పరిగణిస్తున్నారని చెప్పారు. అప్పటి కాంగ్రెస్ నేతలు రాజ్యాంగ కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాశారని, పత్రికా స్వేచ్ఛను హరించారని మండిపడ్డారు.
ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని హరిస్తూ పేదలు, అణగారిన వర్గాలు, దళితులను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. అన్ని వర్గాల పోరాటం వల్లే ఎమర్జెన్సీని ఎత్తివేసి ప్రజాస్వామ్యాన్ని పునరద్దరించారని తెలిపారు.
ఈ సందర్భంగా ఆ రోజులను మోదీ గుర్తుచేసుకున్నారు. ఎమర్జెనీ అప్పుడు ఆర్ఎస్ఎస్ యువ ప్రచారక్ గా ఉన్నానని తెలిపారు. ఆ సమయం తనకు ఒక అభ్యాస అనుభవమన్నారు. ఆ అనుభవాలలో కొన్నింటిని బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ ‘ది ఎమర్జెన్సీ డైరీస్’ పేరిట పుస్తకం రూపంలో సంకలనం చేయడం తనకు సంతోషంగా ఉందన్నారు.
ఎమర్జెన్సీ సమయంలో ఉన్న వారి కుటుంబాలు ఎదుర్కొన్న అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకోవాలని కోరారు. ఇలా చేయడం వల్ల 1975 నుండి 1977 వరకు ఉన్న సమయం గురించి యువతలో అవగాహన పెరుగుతుంటూ ప్రధాని పిలుపునిచ్చారు.