Indigo flight: భారత్ కు మరో ప్రమాదం తృటిలో తప్పింది. ఘోర దారుణం జరగబోయి.. అదృష్టవశాత్తు మరో ముప్పు తప్పింది. గుహవాటి నుంచి చెన్నైకి బయల్దేరిన ఇండిగో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ కింద బెంగళూరు లో నిలిపి వేశారు. ఈ మేరకు పెను ప్రమాదం తప్పింది.
కారణం:
గాలిలో ఉన్న విమానంలో తగినంత ఇంధనం లేకపోవడంతో వెంటనే అప్రమత్తమైన పైలట్.. మేడే కాల్ ఇచ్చారు. ఇది గమనించిన ATC.. విమానాన్ని వెంటనే బెంగళూరుకు డైవర్ట్ చేసి.. ల్యాండ్ అయ్యేలా చేసింది. దీంతో విమానం సేఫ్ గా బెంగళూరులో ల్యాండ్ అయింది.
నేడు సాయంకాలం 4 నలభై నిమిషాలకు అస్సాంలోని గౌహతి నుంచి బయలు దేరిన ఎయిర్ ఇండిగో A321 విమానం.. 7:45 నిమిషాలకు చెన్నైలో l ల్యాండ్ అవ్వాల్సి ఉంది. అయితే ఫ్లైట్ ల్యాండింగ్ గేర్ రన్ వేను తాకిన అనంతరం అది ఏవో సాంకేతిక సమస్యలను ఎదుర్కొంది. దీంతో ఫ్లైట్ లో ఉన్న ప్రయాణికులంతా టెన్షన్ పడినట్లు తెలుస్తోంది.చెన్నైలో దిగడానికి వీలు పడని సందర్భంలో చేసేదేమీ లేక ఫ్లైట్ ను పైలట్ లు బెంగళూరు వైపు నకు మళ్లించినట్లు తెలుస్తోంది. పైలట్ మే డే ను ప్రకటించడంతో బెంగళూరు లో విమాన ల్యాండ్ అయ్యే వద్ద అగ్నిమాక బృందాన్ని, వైద్య బృందాన్ని విమాన యాజమాన్య సంస్థ సిద్ధంగా ఉంచినట్లు తెలుస్తోంది. అయితే విమానానికి కానీ, అందులోని ప్రయాణికులకు గానీ ఎటువండి ప్రమాదం చోటు చేసుకోలేదు.
రాత్రి 8:20 లో విమానం బెంగళూరు లో ల్యాండ్ అవ్వగా.. ఇందన లోపం వల్లే బెంగళూరుకు మలించాల్సి వచ్చిందని విమాన యానా సంస్థ తెలిపినట్లు సమాచారం. తిరిగి ఇంధనం నింపిన తరవాత.. రాత్రి 11 గంటల 25 నిమిషాలకు తిరిగి చెన్నై చేరుకుంటుందని ATC అధికారులు తెలిపాయి.
అయితే ఈ సంఘటన కు సంబంధించి సంబంధిత విమానయాన సంస్థ ఎటువంటి అధికారక ప్రకటన చేయలేదు. ఇటీవల అహ్మదాబాద్ ఘటన దృష్ట్యా ఇప్పుడు ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.