Wednesday, September 18, 2024
HomeNewsతెలంగాణతోనే  కొనసాగుతామన్న సెమీకండక్టర్స్ కంపెనీ కేన్స్

తెలంగాణతోనే  కొనసాగుతామన్న సెమీకండక్టర్స్ కంపెనీ కేన్స్

తెలంగాణతోనే  కొనసాగుతామని  సెమీకండక్టర్ల తయారీ సంస్థ కేన్స్ టెక్నాలజీ తేల్చి చెప్పింది. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని సంస్థ సీఈవో  రఘు ఫణికర్  స్పష్టం చేశారు. ఈ నెల 23న కొంగరకలాన్ లో  కేన్స్ సంస్థ  అడ్వాన్స్ ఎలక్ట్రానిక్ యూనిట్ ను ప్రారంభించబోతున్నది. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రఘు ఫణికర్  సోమవారం సచివాలయంలో కలిసి ఆహ్వానించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న OSAT యూనిట్ ఇండియన్ సెమికండక్టర్ మిషన్ పరిశీలనలో ఉంది. ఐఎస్ఎం అనుమతి రాగానే ఓశాట్ యూనిట్ ఆపరేషన్స్  ప్రారంభిస్తామని  ఫణికర్ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News