Thursday, July 4, 2024
HomeNewsఆదిపురుష్ వసూళ్ల జైత్రయాత్ర..నాల్గు రోజుల్లో నాల్గు వందల కోట్లు

ఆదిపురుష్ వసూళ్ల జైత్రయాత్ర..నాల్గు రోజుల్లో నాల్గు వందల కోట్లు

ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల జైత్రయాత్ర కొనసాగిస్తుంది. ఇతిహాసం రామాయ‌ణం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో శ్రీరాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్ , రావణాసుర పాత్ర లో సైఫ్ అలీఖాన్ లు నటించగా..మొదటి రోజే నెగిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ..బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం ఆ టాక్ ఏ మాత్రం పనిచేయడం లేదు. ఓపెనింగ్ డే నుండి నాల్గు రోజు వరకు కూడా హౌస్ ఫుల్ కలెక్షన్లతో సునామి సృష్టిస్తుంది.

- Advertisement -

ఓ పక్క సినిమా ఫై నిరసనలు , వివాదాలు , ఆందోళలనలు కొనసాగుతున్నప్పటికీ , ప్రేక్షకులు మాత్రం సినిమాను చూసేందుకు పరుగులు పెడుతున్నారు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతుంది. ఇక ఈ మూవీ నాల్గు రోజుల వసూళ్లు చూస్తే.. మూడు రోజుల్లో ఇండియాలో 220 కోట్ల నికరంగా, 260 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో 80 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 340 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక ఆదిపురుష్ సినిమా నాలుగో రోజు కలెక్షన్లు చూస్తే.. ఇండియాలో 25 నుంచి 30 కోట్ల కలెక్షన్లు, ఓవర్సీస్‌లో 5 కోట్ల కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 30 నుంచి 35 కోట్లు వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే ఈ మూవీ నాలుగు వందల కోట్ల జాబితాలో చేరడం ఖాయంగా కనిపిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News