తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర హోంమంత్రి అమిత్షా కీలక వ్యాఖ్యలు. ఆ రెండు రాష్ట్రాల్లోనూ రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి బీజేపీ ఆఫీస్ బేరర్లతో ఏర్పాటు చేసిన ‘కార్యకర్త సమ్మేళన్’లో ప్రసంగించిన అమిత్ షా.
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాల నడుమ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం మధురైలో పర్యటించారు. ప్రఖ్యాత మీనాక్షి అమ్మవారి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు, బీజేపీ తమిళనాడు రాష్ట్ర కోర్ కమిటీ సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులకు ఉత్తేజ పరిచేలా ప్రసంగిస్తూ…రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా వారం రోజుల క్రితం డీఎంకే పార్టీ తమ జనరల్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీలపై విమర్శలతో పాటు పలు తీర్మానాలు చేసిన నేపథ్యంలో ఈ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఏడాది ఏప్రిల్లోనూ అమిత్ షా తమిళనాడు పర్యటన సందర్భంగా బీజేపీ-అన్నా డీఎంకే మధ్య పొత్తు కుదిరినట్లు ప్రకటించారు. ఈ పొత్తు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్తేజాన్ని నింపింది.
సీఎం స్టాలిన్ సమాధానం చెప్పాలి…
తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్)లో జరిగిన భారీ అవినీతి కుంభకోణంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ స్కాంలో సమకూరిన నిధులతో రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో రెండు క్లాస్రూమ్లు నిర్మించి ఉండేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డీఎంకే ప్రభుత్వం అవినీతిమయ పాలన వల్ల రాష్ట్రంలోని పేదలు, మహిళలు, పిల్లల జీవితాలు దుర్భరంగా మారాయని ఆరోపించారు. స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించేందుకు తమిళనాడు బీజేపీ కార్యకర్తలు సంకల్పం తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీఎంకే ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారో సీఎం స్టాలిన్ సమాధానం చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు. గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు రూ.6.80 లక్షల కోట్ల నిధులు కేటాయించినప్పటికీ, కేంద్రం రాష్ట్రానికి ఏమీ చేయలేదని స్టాలిన్ ప్రశ్నించడం ఆశ్చర్యకరమని ఆయన వ్యాఖ్యానించారు.
డీఎంకే పాలనా వైఫల్యం కారణంగానే….
మధురైలో నిర్వహించిన బీజేపీ ‘కార్యకర్త సమ్మేళనం’లో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ మాట్లాడుతూ, అధికార డీఎంకే పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. డీఎంకే పాలనా వైఫల్యం కారణంగానే రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆయన ఆరోపించారు. పశ్చిమ కొంగు ప్రాంతంలోని గ్రామాల్లో వృద్ధుల హత్యలను నియంత్రించడంలో పోలీసులు విఫలమవుతున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో అన్నా డీఎంకేతో కలిసి పనిచేసేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని నాగేంద్రన్ పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి నుంచి గరిష్ట సంఖ్యలో ఎమ్మెల్యేలను గెలిపించుకోవడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అమిత్ షాను “భారతదేశ ఉక్కు మనిషి, సర్దార్ వల్లభాయ్ పటేల్తో సమానమైన నాయకుడు” అని కీర్తించారు.
అధికార డీఎంకేను అధికారం నుంచి దించడమే ఏకైక లక్ష్యంగా…
తమిళనాడు బీజేపీ సీనియర్ నేత కె. అన్నామలై, అధికార డీఎంకేను అధికారం నుంచి దించడమే ఏకైక లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ లక్ష్యం సాధించే వరకు అలుపెరగకుండా పోరాడాలని కార్యకర్తలను కోరారు..ఈ పర్యటన, సమావేశాలు రాష్ట్రంలో బీజేపీ-అన్నా డీఎంకే కూటమి ఊపును మరింత పెంచాయని, రాబోయే ఎన్నికల్లో ఈ కూటమి కీలక పాత్ర పోషించనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాల నడుమ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం మధురైలో పర్యటించారు. ప్రఖ్యాత మీనాక్షి అమ్మవారి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు, బీజేపీ తమిళనాడు రాష్ట్ర కోర్ కమిటీ సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులకు ఉత్తేజ పరిచేలా ప్రసంగిస్తూ…రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా వారం రోజుల క్రితం డీఎంకే పార్టీ తమ జనరల్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీలపై విమర్శలతో పాటు పలు తీర్మానాలు చేసిన నేపథ్యంలో ఈ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఏడాది ఏప్రిల్లోనూ అమిత్ షా తమిళనాడు పర్యటన సందర్భంగా బీజేపీ-అన్నా డీఎంకే మధ్య పొత్తు కుదిరినట్లు ప్రకటించారు. ఈ పొత్తు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్తేజాన్ని నింపింది.
సీఎం స్టాలిన్ సమాధానం చెప్పాలి…
తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్)లో జరిగిన భారీ అవినీతి కుంభకోణంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ స్కాంలో సమకూరిన నిధులతో రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో రెండు క్లాస్రూమ్లు నిర్మించి ఉండేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డీఎంకే ప్రభుత్వం అవినీతిమయ పాలన వల్ల రాష్ట్రంలోని పేదలు, మహిళలు, పిల్లల జీవితాలు దుర్భరంగా మారాయని ఆరోపించారు. స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించేందుకు తమిళనాడు బీజేపీ కార్యకర్తలు సంకల్పం తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీఎంకే ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారో సీఎం స్టాలిన్ సమాధానం చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు. గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు రూ.6.80 లక్షల కోట్ల నిధులు కేటాయించినప్పటికీ, కేంద్రం రాష్ట్రానికి ఏమీ చేయలేదని స్టాలిన్ ప్రశ్నించడం ఆశ్చర్యకరమని ఆయన వ్యాఖ్యానించారు.
డీఎంకే పాలనా వైఫల్యం కారణంగానే….
మధురైలో నిర్వహించిన బీజేపీ ‘కార్యకర్త సమ్మేళనం’లో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ మాట్లాడుతూ, అధికార డీఎంకే పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. డీఎంకే పాలనా వైఫల్యం కారణంగానే రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆయన ఆరోపించారు. పశ్చిమ కొంగు ప్రాంతంలోని గ్రామాల్లో వృద్ధుల హత్యలను నియంత్రించడంలో పోలీసులు విఫలమవుతున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో అన్నా డీఎంకేతో కలిసి పనిచేసేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని నాగేంద్రన్ పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి నుంచి గరిష్ట సంఖ్యలో ఎమ్మెల్యేలను గెలిపించుకోవడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అమిత్ షాను “భారతదేశ ఉక్కు మనిషి, సర్దార్ వల్లభాయ్ పటేల్తో సమానమైన నాయకుడు” అని కీర్తించారు.
అధికార డీఎంకేను అధికారం నుంచి దించడమే ఏకైక లక్ష్యంగా…
తమిళనాడు బీజేపీ సీనియర్ నేత కె. అన్నామలై, అధికార డీఎంకేను అధికారం నుంచి దించడమే ఏకైక లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ లక్ష్యం సాధించే వరకు అలుపెరగకుండా పోరాడాలని కార్యకర్తలను కోరారు..ఈ పర్యటన, సమావేశాలు రాష్ట్రంలో బీజేపీ-అన్నా డీఎంకే కూటమి ఊపును మరింత పెంచాయని, రాబోయే ఎన్నికల్లో ఈ కూటమి కీలక పాత్ర పోషించనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.