JOLT FOR THE INDIA BLOCK : బిహార్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ, రాజకీయ రంగంలో ఆసక్తికరమైన మలుపు చోటు చేసుకుంది. ఇండియా కూటమిలో కీలక భాగస్వామి అయిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బిహార్లోని 243 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఆప్ బిహార్ చీఫ్ రాకేశ్ కుమార్ ఈ విషయాన్ని ప్రకటించడంతో, ఇది ఇండియా కూటమికి పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించబడుతోంది.బిహార్లో ఆప్ ఒంటరిగా పోటీ చేయడంతో, అది కాంగ్రెస్ ఓట్లను చీల్చి ఇండియా కూటమికి నష్టం, ఎన్డిఎకు లాభం చేకూరుస్తుందా అన్న చర్చ మొదలైంది. ఢిల్లీ మోడల్ను ఇక్కడ అమలు చేయాలని ఆప్ చూస్తున్నా, అది ఎంత మేరకు ఓట్లను సాధించి, బిహార్లో మూడో ప్రత్యామ్నాయంగా నిలుస్తుందో ఎన్నికల ఫలితాల తర్వాతే స్పష్టమవుతుంది. ఈ పరిణామం బిహార్ రాజకీయాల్లో ప్రస్తుతం కీలక మార్పులకు దారి తీయనుంది.
ఆప్ ఎంట్రీ, దాని ప్రభావం:
2012లో ప్రస్థానం ప్రారంభించిన ఆప్, 2013 ఢిల్లీ ఎన్నికల నుండి బిహారీ ఓటర్లను ఆకట్టుకుంది. ఢిల్లీలో బిహారీలు ఆప్ పాలనను బలపరిచారు. ఈ ఫిబ్రవరిలో ఢిల్లీలో 22 స్థానాలు గెలిచినా, బీజేపీతో కేవలం 2% ఓట్ల తేడానే ఉంది, పూర్వాంచల్లో ఆప్ మంచి పట్టు సాధించింది. ఇది బిహార్లో ఆప్ బలానికి నిదర్శనం. సంస్థాగత మార్పులతో బద్లీ ఎమ్మెల్యే అజేశ్ యాదవ్ను బిహార్ ఇన్ఛార్జ్గా నియమించి, రాకేశ్ కుమార్ నేతృత్వంలో అన్ని 243 స్థానాల్లో పోటీకి సిద్ధమవుతోంది. బిహార్లో ఆప్ మూడో ప్రత్యామ్నాయంగా బలపడుతోందని పార్టీ నమ్ముతోంది.
ఆప్ వ్యూహారచనలు :
బిహార్లో ఆప్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. జూన్ 17న సంజయ్ సింగ్ ప్రచారం ప్రారంభించనుండగా, ఢిల్లీ తరహాలో ఉచిత విద్యుత్, నీరు వంటి హామీలను ఇస్తోంది. ఢిల్లీలోని మురికివాడల కూల్చివేతలపై బిహార్ ప్రజల ఆగ్రహాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తోంది, దీనిపై పెద్ద ఉద్యమం చేయాలని యోచిస్తోంది. కేజ్రీవాల్ సహా ఇతర నేతలు కూడా ప్రచారానికి రానున్నారు. ఆప్ ఒంటరి పోరు ఇండియా కూటమికి చెందిన కాంగ్రెస్, ఆర్జేడీ ఓట్లను చీల్చి పరోక్షంగా ఎన్డీఏకు లాభం చేకూర్చవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఆప్ ఎంతమేరకు విజయం సాధించి, బిహార్లో మూడో ప్రత్యామ్నాయంగా నిలుస్తుందో ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.
BIHAR ASSEMBLY ELECTIONS : ఒంటరిగా బరిలో దిగనున్న ఆప్
- Advertisement -