Wednesday, June 11, 2025
HomeNewsBIRTH DAY IN TRAIN: పుట్టినరోజు వేడుక.. విషెస్ కు బదులు విమర్శలు!

BIRTH DAY IN TRAIN: పుట్టినరోజు వేడుక.. విషెస్ కు బదులు విమర్శలు!

BIRTH DAY IN TRAIN: పుట్టినరోజు వేడుకలు వినూత్నంగా జరుపుకోవడం సాధారణమే.. కానీ కొన్నిసార్లు వినూత్నం విమర్శలకు దారి తీస్తుంది. అలాంటి వినూత్న సంఘటనకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ వేదిక అవ్వగా… నెట్టింట్లో విషెస్ కు బదులుగా విమర్శలు వస్తున్నాయి.

ఏం జరిగిందంటే….
జూన్ 6న ప్రధాని మోదీ ప్రారంభించిన అంజి ఖాడ్ వంతెనపై నుంచి వెళ్తున్న వందేభారత్ రైలులో రాకేష్, నేహా జైస్వాల్ దంపతులు తమ ఆరేళ్ల కుమారుడు మోక్ష్ పుట్టినరోజును కేక్ కట్ చేసి జరుపుకున్నారు. ఈ వేడుకను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా, అది వైరల్ అయింది.
అయితే, ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైలులో కొవ్వొత్తులు వెలిగించడం ప్రమాదకరం అని, ఇది భద్రతా నిబంధనలను ఉల్లంఘించడమే అని మండిపడుతున్నారు. “రైలు మీ పార్టీ హాల్ కాదు”, “లోపల కొవ్వొత్తులు వెలిగించడం సురక్షితం కాదు” అంటూ కామెంట్లు పెడుతున్నారు.

రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌లను ట్యాగ్ చేస్తూ, ఇలాంటి బాధ్యతారహితమైన చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఇతర ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేసినందుకు శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కొవ్వొత్తుల వల్ల అగ్ని ప్రమాదం సంభవించి ఉంటే పెను నష్టం జరిగి ఉండేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా రైల్వే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News