Thursday, June 19, 2025
HomeNewsVijay Deverakonda: వీర‌మ‌ల్లు Vs కింగ్‌డ‌మ్‌

Vijay Deverakonda: వీర‌మ‌ల్లు Vs కింగ్‌డ‌మ్‌

Hari Hara Veera mallu: ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, పెద్ద సినిమాల మధ్య క్లాష్ లు నివారించలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఎప్పటినుంచో వాయిదాలు పడుతూ వస్తున్న హరిహర వీరమల్లు మరియు కింగ్‌డమ్ లాంటి పాన్ ఇండియా చిత్రాలు ఇప్పుడు ఒకే వారం లో రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు జూలై 24న రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. మొదట జూలై 18 అనే టార్గెట్ పెట్టుకున్నప్పటికీ, అదే వారం ఘాటీ అనే మరో పెద్ద సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఉండటంతో, వారం పక్కకు తొలగించారు అని వినికిడి. త్వ‌ర‌లోనేది దీనిపై అధికారిక ప్రకటన రావచ్చని టాక్.

- Advertisement -

హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు రిలీజ్‌కు లైన్ క్లియ‌ర్ చేసుకునే టైమ్‌లోనే కింగ్‌డమ్ కూడా జూలై 25న రిలీజ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్ తో చేసిన ఒప్పందాల ప్రకారం, వేరే డేట్ ను ఎంచుకునే అవకాశం లేకపోవడం వల్ల ఈ తేదీకే ఫిక్స్ అయినట్టు సమాచారం. త్వరలోనే ఓ వీడియో ద్వారా అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయబోతున్నారు.సితార ఎంటర్టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం, పవన్ సినిమా రిలీజింగ్ వారం లోనే రావడం తాము ఆశించకపోయినా, పరిస్థితులు ఆ దిశగా నెట్టుకుపోయాయి. నిర్మాత నాగవంశీ గతంలో పవన్ సినిమాలా ఎదురెదురు పోటీకి తాము దూరంగా ఉంటామని చెప్పినప్పటికీ, ఈసారి మాత్రం డేట్ మార్చే అవ‌కాశం లేక‌పోవ‌టంతో ముందుకెళ్లారని తెలుస్తోంది.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/director-maruthi-reveals-story-of-prabhas-the-raja-saab/

ఈ రెండు సినిమాలకి రిలీజింగ్ విషయంలో ఓటిటిల ప్రభావం ఎంతగానో చూపుతోందని, ఇది పరిశ్రమకు మంచి సంకేతం కాదని పలువురు సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ఎప్ప‌టి నుంచో పెండింగ్‌లో ఉన్న సినిమా ఐదేళ్లుగా సినిమా నిర్మాణ ద‌శ‌లోనే ఉండింది. ప‌వ‌న్ రాజ‌కీయాల్లో బిజీగా ఉండ‌టంతో ఆ సినిమాను అనుకున్న స‌మ‌యంలో పూర్తి చేయ‌లేక‌పోయాడు. మ‌రోవైపు క‌రోనా రావ‌టం కూడా సినిమా ప్రొడ‌క్ష‌న్‌పై ప్ర‌భావాన్ని చూపింది. ఎట్ట‌కేల‌కు డిప్యూటీ సీఎం అయిన ప‌వ‌న్ రాజ‌కీయాల్లో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ స‌మ‌యాన్ని కేటాయించి హ‌రిహ‌ర వీర‌మ‌ల్లుని కంప్లీట్ చేశారు. జూన్12న రిలీజ్ చేయాల‌నుకున్న ఈ సినిమా గ్రాఫిక్స్ వ‌ర్క్ కార‌ణంగా ఆల‌స్య‌మైంది. ఇప్పుడు జూలై 24న రిలీజ్ చేయ‌టానికి ప్లానింగ్ జ‌రుగుతోంది.

విజ‌య్ దేవ‌ర‌కొండ పాన్ ఇండియా మూవీ కింగ్‌డ‌మ్ విష‌యంలోనూ అంతే ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కూడా రీషూటింగ్స్ కార‌ణంగా ఆల‌స్య‌మైంది. ఈ ఏడాదిలో వ‌ద్దామ‌నుకుంటే ఒక‌ట్రెండు సార్లు హ‌రిహ‌ర వీర‌మ‌ల్లుతో పోటీ ప‌డాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. దీంతో కింగ్‌డ‌మ్ వెన‌క‌డుగు వేసింది. ఇప్పుడు ఓటీటీ డీల్ కార‌ణంగా.. సినిమా రిలీజ్‌ను వాయిదా వేయ‌లేని ప‌రిస్థితి వ‌చ్చింది. మ‌రి మేక‌ర్స్ ఎలా ప్లానింగ్ చేసుకుంటారో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News