Tuesday, June 17, 2025
HomeNewsThe Rajasaab: టీజర్‌తో క్లారిటీ ఇచ్చిన మారుతి

The Rajasaab: టీజర్‌తో క్లారిటీ ఇచ్చిన మారుతి

Prabhas: బాహుబలి సిరీస్ తర్వాత పాన్ ఇండియా రేంజ్‌లో ప్రభాస్‌కి ఎలాంటి క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ జనరేషన్‌లో పాన్ ఇండియా సినిమాలు మొదలైంది డార్లింగ్‌తోనే. తెలుగులో ప్రభాస్ క్రేజ్ చూసి ఇతర భాషలలో మేకర్స్ షాకైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలు అందరినీ బాగానే డిసప్పాయింట్ చేశాయి. అయినా డార్లింగ్ క్రేజ్ చెక్కు చెదరలేదు. అందుకే, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ – కేస్ ఫైర్ సంచలన విజయాన్ని అందుకుంది.

- Advertisement -

సలార్ తర్వాత ప్రభాస్ నుంచి కల్కి వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబట్టింది. ఇప్పుడు సలార్, కల్కి సినిమాల సీక్వెల్స్ రావాల్సి ఉంది. నాగ్ అశ్విన్ ఆల్రెడీ కల్కి సినిమాకి సంబధించిన 30 శాతం టాకీ పార్ట్‌ని షూట్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్ వెల్లడించారు. ఇక ఇప్పుడు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రేజీ మూవీ ‘ది రాజాసాబ్’. ఈ సినిమా ప్రకటించి దాదాపు నాలుగేళ్ళు అవుతోంది. ఒకేసారి ప్రభాస్ ఆదిపురుష్, సలార్, కల్కి సినిమాలతో పాటు ది రాజాసాబ్ ఒప్పుకోవడం వల్ల అన్ని సినిమాల షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.

ALSO READ: https://teluguprabha.net/news/hari-hara-veeramallu-release-date/

అయితే, మారుతి ఇప్పటి వరకూ భారీ బడ్జెట్ చిత్రం తీయలేదు. మరీ ముఖ్యంగా ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్‌తో ఇదే రేంజ్ సినిమాను తీయలేదు. ఈ విషయంలో చాలామందికి దర్శకుడు మారుతి మీద అనుమానాలున్నాయి. ప్రభాస్ లాంటి బిగ్ స్టార్‌ని ఎలా డీల్ చేస్తున్నారో అని. ఆ అనుమాలన్నీ ఒక్క టీజర్‌తో తీరిపోయాయి. హైదరాబాద్ లోని ప్రసాద్స్ బిగ్ స్క్రీన్ మీద ది రాజాసాబ్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ గ్రాండ్ ఈవెంట్‌లో దర్శకుడు మారుతి, నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. సినిమా పక్కాగా మెప్పిస్తుందని, టీజర్‌లో చూసింది పది శాతం మాత్రమేనని, ప్రభాస్, డైరెక్టర్ టీజీ విశ్వప్రసాద్ కారణంగానే ఇది సాధ్యమవుతుందని మారుతి అన్నారు. ఆయన చెప్పిన మాటలు వింటే వింటేజ్ ప్రభాస్ ఆడియెన్స్‌ను అలరించటం పక్కా అనే విషయాన్ని చెప్పేశారు.

ముందు నుంచి చెబుతున్నట్టుగా హర్రర్, కామెడీ జోనర్‌లో రాజాసాబ్ రూపొందుతోంది. తాత-మనవడి పాత్రల్లో డార్లింగ్ అలరించబోతున్నారని టీజర్‌తో మారుతి క్లారిటీ ఇచ్చేశారు. హీరోయిన్స్‌గా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రల్లో కనిపించారు. ఎస్ ఎస్ థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్స్ట్ లెవల్‌లో నిలబెడుతుంది. ప్రస్తుతం రాజాసాబ్ టీజర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News