Tuesday, June 17, 2025
HomeతెలంగాణGodavari - bankachrla: బంకచర్ల ప్రాజెక్టు అంశంపై సీఎం అత్యవసర సమావేశం..!

Godavari – bankachrla: బంకచర్ల ప్రాజెక్టు అంశంపై సీఎం అత్యవసర సమావేశం..!

గోదావరి – బంకచర్ల ప్రాజెక్టు అంశంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు బుధవారం నాడు అనగా జూన్ 18 తేదీన సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలోని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (నీటి పారుదల శాఖ) కార్యాలయంలో ఆల్ పార్టీ పార్లమెంట్ సభ్యులకు సంబంధిత ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేష‌న్ ఇవ్వనున్నారు. ఈ సమావేశంసీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుండగా.. అఖిలపక్ష ఎంపీలతో పాటు అన్ని పార్టీల లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు కూడా ఈ చర్చలలో పాల్గొననున్నారు. చర్చల అనంతరం వారందరి అభిప్రాయాలు, సూచనలు ఇవ్వాలని ప్రభుత్వం కోరినట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనైన గోదావరి‑బనకచర్ల ప్రాజెక్ట్ ప్రీ‑ఫీజిబిలిటీ రిపోర్ట్‌ను కేంద్రం ఆమోదించినట్లుగా తెలవగానే.. తెలంగాణ నీటి యాజమాన్య బోర్డు, సీడబ్ల్యూసీ గ్రూపులు తక్షణమే దీనిని నిలిపివేయాలని విజ్ఞప్తి చేశాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఈ ప్రాజెక్ట్ గోదావరి నది జలాల వివాదాల ట్రిబ్యునల్ అవార్డు (1980) & AP విభజన చట్టం 2014ను ఉల్లంఘిస్తున్నదని.. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వాటాలపై ఇది ప్రతికూల ప్రభావం ఉందని కేంద్రానికి రాసిన లేఖలో తెలిపారు. 

ఇదే అంశంపై బీ ఆర్ ఎస్ నేత హరీష్ రావు కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్ద సమన్యాయం కోరుతూ అన్ని పార్టీ సభ్యులను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News