DNA Tests for Air India Plane Crash Victim Bodies: అహ్మదాబాద్ నుంచి లండన్కి బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానం టేకాఫ్ అయినా కాసేపటికే ప్రమాదానికి గురైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ప్రమాదంలో సిబ్బందితో పాటు మొత్తం 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటనతో యావత్ లోకం ఉలిక్కిపడింది. ఈ ప్రమాదంలో శవాలు గుర్తుపట్టలేనంతా విధంగా కాలిపోయాయి. అయితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఘటనా స్థలిలోనే మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో చనిపోయిన వారి బాడీలను గుర్తించడం అధికార యంత్రాగానికి కర్రమీద సామే అని చెప్పాలి.
ప్రస్తుతం ఎంతో టెక్నాలజీ అందుబాటులో ఉన్నాకానీ కొన్నిసార్లు DNA పరీక్షల్లోనూ మృతులను అధికారికంగా నిర్ధారించలేని పరిస్థితి నెలకొంటుంది. ఈ సందర్భంలో కుటుంబ సభ్యుల్లో కాస్త ఆందోళన ఉంటుంది. తాజా ప్రమాదంలోనూ ఇప్పటికే అధికారులు డీఎన్ఏ టెస్టింగ్ ప్రక్రియను ప్రారంభించారు. అయితే పేరెంట్స్ లేని వారి బాడీలను గుర్తించే ప్రక్రియ కాస్త జఠిలం కానుంది. ఎందుకంటే..
ప్రస్తుతం ప్రమాద బాదితులకు DNA నమూనాల సేకరణ కొనసాగుతోంది. అయితే ఈ పరీక్షలు మొత్తం పూర్తవటానికి ఇంకా 72 గంటలు పట్టే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే కొందరి మృతదేహాలను వైద్యులు డీఎన్ఏ టెస్ట్ ద్వారా గుర్తించారు. అయితే ఈ ప్రమాదంలో ఓ ఫ్యామిలీ మొత్తం ప్రాణాలు కోల్పోవడం అందరి హృదయాలను కలచి వేసింది. ఇలాంటి సందర్భంలో డెడ్బాడీలను గుర్తించడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది.
DNA సాంకేతికతతో గుర్తింపు: ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి తల్లిదండ్రులు లేదా సహోదరులు ఎవరైనా అందుబాటులో లేకపోతే, డీఎన్ఏ టెస్ట్ కోసం రక్త సంబంధీకులను వైద్యులు పరిశీలిస్తారు. ఉదాహరణకు తండ్రి సోదరులు (పెదనాన్న లేదా బాబాయి), తల్లి సోదరులు (మామ), లేదా తాత ముత్తాతల నుంచి శాంపిల్స్ సేకరిస్తారు. పురుషులను తండ్రి నుంచి కొడుకుకు పంపబడే వై-క్రోమోజోమ్ ఆధారంగా గుర్తిస్తారు. అదే సమయంలో మైటోకాండ్రియల్ డీఎన్ఏ ద్వారా పురుష లేదా స్త్రీ డీఎన్ఏలను సులభంగా కనుక్కోవచ్చు.
అయితే సొంత ఫ్యామిలీ కాకుండా కాస్త దూరంగా ఉన్నవారి నుంచి సేకరించిన శాంపిల్స్ని ఉపయోగించినప్పుడు టెస్ట్లో ఖచ్చితత్వం తగ్గిపోనుంది. ఉదాహరణకు.. మేనమామలు లేదా కజిన్లలో చాలా తక్కువ శాతం డీఎన్ఏ పంచుకునే అవకాశం ఉంది. కావున వారి నుంచి సేకరించిన శాంపిల్స్ ఆధారంగా కచ్చిమైన నిర్ధారణకు వైద్యులు రాలేరు. ఇవే కాకుండా ఇంకా మరెన్నో అధునాతన సాంకేతికతను ఉపయోగించి డెడ్బాడీలను వైద్యులు ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది.
ఒక్కడంటే ఒక్కడే: ఇక ఈ విమానంలో మొత్తం 230 మంది ప్రయాణికులతో పాటు 12 మంది సిబ్బంది ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఒక్క ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక మిగిలిన వారందరి బాడీలు గుర్తించలేని స్థితిలో కాలిపోయాయి. ప్రధానమంత్రి మోదీ, హోం మంత్రి అమిత్ షా, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ ప్రమాద స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. చనిపోయిన ఒక్కొక్కరికి రూ. 1 కోటి పరిహారాన్ని టాటా గ్రూప్ ప్రకటించింది. గాయపడినవారికి పూర్తి వైద్యసాయం అందిస్తామని సైతం వారు హామీ ఇచ్చారు.