Thursday, September 12, 2024
HomeNewsJadcharla: ఘనంగా నూలు రాఖీ పౌర్ణమి వేడుకలు

Jadcharla: ఘనంగా నూలు రాఖీ పౌర్ణమి వేడుకలు

జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట శ్రీ అంబ భవాని దేవాలయంలో నూలు రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్చర్ల, కావేరమ్మ పేట పద్మశాలి సంఘం అధ్యక్షులు పున్న కాశీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో శ్రీ భక్త మార్కండేయ స్వామికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించి, నూలు రాఖి పౌర్ణమి విశిష్టతను, శ్రీ మార్కండేయ స్వామి చరితను వివరించారు. దేవాలయ ప్రాంగణంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

- Advertisement -

కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు, మహిళలు, యువకులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News