Sunday, July 7, 2024
HomeNewsKatasani: సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా చూడండి

Katasani: సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా చూడండి

జగనన్న ప్రభుత్వాన్ని దీవించాలన్న కాటసాని

సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని పాణ్యం ఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. కాటసాని ఆధ్వర్యంలో పాణ్యం నియోజకవర్గ పరిధిలోని, కల్లూరు అర్బన్:33 వ వార్డులోని 85 వ సచివాలయం, కల్లూరులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్యెల్యే కాలనీలోని ప్రతీ గడపకు వెళ్లి రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న జనరంజక పాలన, అవినీతి రహిత పాలన గురించి ప్రజలకు వివరిస్తూ జగనన్న ప్రభుత్వాన్ని దీవించాలని కోరారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికి అందేలా చూడాలని సంబంధిత సచివాలయ సిబ్బందిని ఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆదేశించారు.

- Advertisement -


ఈకార్యక్రమంలో…స్థానిక వార్డ్ కార్పొరేటర్ మైతాపు నరసింహులు,కార్పొరేటర్ & స్టాండింగ్ కమిటీ మెంబర్ సాన శ్రీనివాసులు,కార్పొరేటర్లు…సంగాల సుదర్శన్ రెడ్డి,నారాయణరెడ్డి, కాశపోగు జయరాముడు, తిరుపాల్, వైజా.బాలచంద్ర రెడ్డి, కార్పొరేటర్ & వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళ విభాగం జోనల్ ఇంచార్జ్ శ్వేతారెడ్డి, 33 వ వార్డులోని వైఎస్సార్ సీపీ నాయకులు… రంగప్ప, జగదీష్, భాస్కర్, సుబ్బారెడ్డి, వీరేందర్, ఇస్మాయిల్, దేవాలయ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు, ఇలియాస్, భద్రప్ప,కేశవరెడ్డి, ఈశ్వరయ్య, వానప్ప, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాటి పుల్లారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్కిమి హనుమంతు రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్సిసెల్ శివ సందేపోగు, వైఎస్సార్ సీపీ నాయకులు లక్ష్మీకాంత్ రెడ్డి, నియోజకవర్గ పరిధిలోని పలువురు నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, సంబందిత అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News