Sunday, October 6, 2024
HomeఆటKohli: కోహ్లీ, అనుష్క ఆ బాబా దర్శనం ఎందుకు చేసుకున్నారు?

Kohli: కోహ్లీ, అనుష్క ఆ బాబా దర్శనం ఎందుకు చేసుకున్నారు?

హాలీవుడ్ యాక్ట్రెస్ జూలియా రాబర్ట్స్, ఆపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్, ఫేస్ బుక్ ఫౌండర్ మార్క్ జుకర్ బర్గ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది సెలబ్రిటీలకు ఈయన ఆరాధ్యుడు. నీమ్ కరోలీ బాబాకు తామంతా ఫాలోయర్స్ అని వీరు చాలా సందర్భాల్లో చెప్పారు. తాజాగా విరాట్ కోహ్లి, అనుష్క శర్మ కూడా నీమ్ కరోలీ బాబా సమాధి దర్శనం చేసుకున్నారు. ఉత్తరాఖండ్ లోని కుమావూన్ పర్వత ప్రాంతంలోని కోసి నది ఒడ్డున కైంచి ధామం ఉంది. గతకొన్నేళ్లుగా ఈ ఊరి పేరు మరింత మారుమోగుతోంది. దీనికి కారణం ఈ ఊరు, బాబా గురించి ప్రధాని మోడీకి స్వయంగా మార్క్ జూకర్ బర్గ్ చెప్పగా ఈ ఆశ్రమాన్ని విజిట్ చేసేవారి సంఖ్య ఇంకా పెరిగిపోయింది. తన ఆధ్యాత్మిక గురువు కరోలీ బాబాగా జుకర్ బర్గ్ చెబుతారు. ఇక్కడి ఆశ్రమంలోని బాబా సమాధి సందర్శనకు ఫారిన్ డివోటీస్ పెద్ద ఎత్తున వస్తున్నారు. హనుమంతుడి భక్తుడిగా ఈ బాబా ప్రపంచ ప్రసిద్ధిచెందారు. కరోలీ బాబాకు మనదేశంలోనే కాదు టెక్సాస్ లోనూ టెంపుల్ ఉంది. లేట్ 60ల్లో ఈయనకు అమెరికన్ ఫాలోయర్స్ చాలా ఎక్కువగా ఉండేవారు. ఆశ్రమాన్ని సందర్శించాలంటే మాత్రం ముందుగానే అనుమతులు ఆశ్రమం నుంచి తీసుకోవాలి. ఒకవేళ ఎవరైనా పాత భక్తులు రెఫరెన్స్ ఇస్తే మూడు రోజులపాటు ఈ ఆశ్రమంలోనే బస చేయచ్చు. కాకపోతే ఇక్కడి చాలా చలి ఉంటుంది అందుకే ఏడాదిలో చాలా రోజులపాటు ఈ ఆశ్రమం మూసి ఉంటుంది. 1973లో సమాధి చెందిన ఈయన్ను మహారాజ్జీ అని భక్తులు పిలుస్తారు. మహారాజ్జీ దర్శనం చేసుకుంటే కోరుకున్నవన్నీ నెరవేరతాయని, మనసుకు ప్రశాంతత లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News