Friday, September 20, 2024
HomeNewsMaddikera: అనారోగ్యంతో జవాన్ మృతి

Maddikera: అనారోగ్యంతో జవాన్ మృతి

మద్దికేర మండల పరిధిలోని హంప గ్రామానికి చెందిన తలారి జోగన్న (37) అనారోగ్యంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొన్ని మృతుడు అస్సాం రైఫిల్ లో జవాన్ గా విధులు నిర్వహిస్తూ అనారోగ్య సమస్యతో గత పది రోజుల క్రితం సొంత గ్రామమైన అంపక చేరుకున్నారు. అప్పటి నుండి వివిధ వైద్యశాలలో వైద్య సేవలు పొందాడు ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం కర్నూల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందడంతో విషయం తెలుసుకున్న అస్సాం రైఫిల్ ఉన్నత సిబ్బంది సోమవారం మృతుడి స్వగ్రామం తెచ్చారు. అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. జోగన్న అస్సాం రైఫిల్ లో వివిధ స్థాయిలో విధులు నిర్వహిస్తూ అందరితో ఆప్యాయంగా ఉండేవాడని విధుల పట్ల అంకితభావంతో పనిచేస్తూ అనారోగ్య కారణంగా మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. గ్రామస్తులు, మాజీ ప్రజా ప్రతినిధులు మృతదేహానికి నివాళులుర్పించారు. నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందాడని, అలాంటి వ్యక్తి గ్రామనికి దూరం కావడం విచారకరమన్నారు. అనంతరం స్థానిక స్మశాన వాటికలో అస్సాం రైఫిల్స్ సిబ్బంది, స్థానిక పోలీసులు సైనిక వందనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. మృతుడికి భార్య రాజేశ్వరితో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News