Friday, September 20, 2024
HomeNewsMadhavaram Krishnarao: పెండింగ్ పనులకు నిధుల విడుదల

Madhavaram Krishnarao: పెండింగ్ పనులకు నిధుల విడుదల

45 రోజుల పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు KPHB బాలాజీ నగర్ డివిజన్లోని మొత్తం 5 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన నిర్వహించారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 45 రోజులుగా సాగిన పాదయాత్రలో అక్కడక్కడ పెండింగ్లో ఉన్న పనులు గుర్తించి ప్రజల నుంచి స్వీకరించిన వినతులను దృష్టిలో పెట్టుకుని వెంటనే నిధులు మంజూరు చేస్తూ పనులు పూర్తి చేసేందుకు శంకుస్థాపన నిర్వహిస్తున్నామని… నియోజకవర్గంలోని దాదాపు 95% పనులు ఇప్పటికే పూర్తి చేసామని.. ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు విషయంలో ఎటువంటి రాజీ పడకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని అన్నారు..

- Advertisement -

అలాగే ఈ పెండింగ్లో ఉన్న సిసి రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తయితే కూకట్పల్లి నియోజకవర్గంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదని తెలిపారు… ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం కేవలం 10 సంవత్సరాల్లో ఎన్నో విజయాలు సాధించిందని.. ఇందుకు నిదర్శనమే జాతీయస్థాయిలో అన్ని రంగాల్లో ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని అనడంలో సందేహం లేదని అన్నారు…

అలాగే ప్రపంచ వేదికలపై తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందని …దీనికి కేటీఆర్ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు.. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పగడాల శిరీష బాబురావు, మందడి శ్రీనివాసరావు డివిజన్ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ కోఆర్డినేటర్ సతీష్ అరోరా అధికారులు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News