Wednesday, June 18, 2025
HomeNewsNayanthara: ముచ్చ‌ట‌గా మూడోసారి నాగార్జునతో..?

Nayanthara: ముచ్చ‌ట‌గా మూడోసారి నాగార్జునతో..?

Nagarjuna Akkineni: లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటు సౌత్‌లో అటు నార్త్‌లో మంచి క్రేజీ ప్రాజెక్ట్స్ చేసి బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఆమె చేసిన సినిమాలలో చాలావరకూ హిట్సే ఉన్నాయి. అంతేకాదు, నయనతార ఎలాంటి పాత్రల్లోనైనా ఒదిగిపోగలరు. అంధురాలిగా మెప్పించగలరు, గ్లామర్ హీరోయిన్‌గా అలరించగలరు..పర్ఫార్మెన్స్‌తో ప్రశంసలు కురిపించుకోగలరు. అందుకే, నయన్ ని హీరోయిన్‌గా తీసుకునేందుకు మేకర్స్ అసలు ఆలోచించరు. సీనియర్ హీరోలతో జోడీ ఎవరా?అని మేకర్స్ ఆలోచిస్తే వారికి సమాధానంగా నయనతార కనిపిస్తుంది. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలందరితోనూ నయనతార జత కట్టింది. ముఖ్యంగా ముగ్గురు సీనియర్ హీరోస్ అయిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునతో ఆమె చేసిన సినిమాలను గమనిస్తే అందులో మనకు ఓ ప్యాట్రన్ కనిపిస్తుంది. ఇంతకీ ఏంటా ప్యాట్రన్ అంటే ముగ్గురిలో చిరంజీవి, బాలయ్య, వెంకీలతో మూడు సినిమాల్లో నటించింది. నాగార్జునతో మూడో సినిమా నటించనుందని టాక్.

- Advertisement -

ప్రస్తుతం నయనతార తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన మెగా 157 మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సినిమాతో మళ్ళీ తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చారు. అంతేకాదు, అసలు ప్రమోషన్స్‌కి రాని నయన్ ఈ మూవీ ఒప్పుకున్నప్పటినుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. గతంలో చిరంజీవితో రెండు సినిమాలు చేశారు నయన్. వాటిలో ఒకటి సైరా నరసింహారెడ్డి..ఇందులో చిరంజీవి భార్యగా నటించిన నయన్.. మరో సినిమా గాడ్ ఫాదర్ మూవీలో యాక్ట్ చేసింది. అయితే గాడ్ ఫాదర్ మూవీలో చిరు చెల్లిగా కనిపించారు.

ALSO READ: https://teluguprabha.net/news/vijay-deverakonda-fans-are-scared-with-sentiment/

ఇక వెంకటేశ్‌తో తులసి, లక్ష్మీ, బాబు బంగారం సినిమాలు చేశారు. నందమూరి బాలకృష్ణ సరసన కూడా జై సింహా, సింహా, శ్రీరామరాజ్యం సినిమాలు చేశారు. వీరి ముగ్గురుతో మూడు సినిమాలు చేసిన నయన్..నాగార్జున తో మాత్రం రెండు సినిమాలే చేశారు. అవి బాస్, గ్రీకు వీరుడు. ఇప్పుడు ముచ్చటగా మూడవసారి నాగ్ 100వ సినిమాలో నటించబోతుందని క్రేజీ న్యూస్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. త్వరలో దీనికి సంబంధించిన అప్‌డేట్ రానున్నట్టు టాక్. ఇదే జరిగితే నాగ్‌తో కూడా నయన్ మూడు సినిమాలు కంప్లీట్ చేసిన హీరోయిన్‌గా రికార్డ్ సృష్ఠిస్తారు.

నయనతార ఈమ‌ధ్య సినిమాలు చేయ‌టంలో త‌న పంథాను మార్చింది. భారీ రెమ్యున‌రేష‌న్‌..అంటే ప‌ది కోట్ల‌కు పైగానే న‌య‌న్ ఇప్పుడు డిమాండ్ చేస్తుంది. ఆమెకున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని మేక‌ర్స్ ఆమె అడిగినంత రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌టానికి రెడీ అయిపోతున్నారు. ఒక‌ప్పుడు భారీ పారితోషకం తీసుకున్న‌ప్ప‌టికీ ప్ర‌మోష‌న్స్ విష‌యంలో మాత్రం దూరం దూరం అంటుండేది ఈ మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ‌. కానీ ఇప్పుడు త‌న స్టైల్‌ను మార్చ‌కుంది. ప్ర‌మోష‌నల్ యాక్టివిటీస్‌లోనూ పాల్గొంటుంది. ఆ మ‌ధ్య మూకుత్తి అమ్మ‌న్‌2 మూవీ ఓపెనింగ్‌కు వ‌చ్చి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచిన న‌య‌న‌తార‌.. మెగా157 కోసం స్పెష‌ల్ వీడియోలోనూ న‌టించిన సంగ‌తి తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News