Suryadevara Naga Vamsi: పవర్స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తోన్న సినిమాల్లో OG సినిమాపై భారీ స్థాయిలో హైప్ నెలకొంది. ‘సాహో’ ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ డ్రామా, పవన్ అభిమానులకే కాకుండా సినీ ప్రేక్షకులందరికీ ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, మేకింగ్ గ్లింప్సులు సోషల్ మీడియాలో హిట్ అయ్యాయి. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్కు సంబంధించి వరుసగా అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. సినిమా సెప్టెంబర్25న గ్రాండ్ రిలీజ్ కానుందని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు.
ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో టాలీవుడ్కు పరిచయం అవుతున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతాన్ని అందిస్తుండగా, టెక్నికల్ గా కూడా ఈ సినిమా బలంగా నిలవనుంది. మొత్తం మీద ఈ చిత్రాన్ని సుమారు రూ. 250 కోట్లకు పైగా బడ్జెట్తో నిర్మిస్తున్నారు. పవర్స్టార్ తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేసేశారు కూడా. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమా రిలీజ్ డేట్ కూడా వచ్చేయటంతో సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం మంచి పోటీ ఏర్పడిందని సినీ సర్కిల్స్ అంటున్నాయి.
ALSO READ: https://teluguprabha.net/news/superstar-rajinikanth-puts-telugu-director-vivek-athreya-on-hold/
ఇండస్ట్రీలో వినిపిస్తోన్న తాజా సమాచారం ప్రకారం, OG సినిమా థియేట్రికల్ బిజినెస్ రికార్డులు తిరగరాస్తోంది. పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఎన్టీఆర్ నిర్మాత రిస్క్ చేస్తున్నారనేది లేటెస్ట్ న్యూస్. ఇంతకీ ఆ నిర్మాత ఎవరో కాదు.. సూర్యదేవర నాగవంశీ. ఈయన పవన్తో ఇది వరకు భీమ్లా నాయక్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఉన్న అనుబంధం, సినిమాపై ఉన్న హైప్ కారణంగా సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ, సీడెడ్ (రాయలసీమ) ఏరియాలో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ను ఏకంగా రూ. 24 కోట్లకు సొంతం చేసుకున్నట్టు టాక్. సాధారణంగా ఈ ప్రాంతంలో పెద్ద సినిమాల రేట్లు రూ. 15-20 కోట్లు మధ్యలో ఉండగా, OG కోసం ఇదొక బ్రేక్ ది రికార్డ్ డీల్గా నిలిచింది. పవన్కు ఈ ప్రాంతంలో ఉన్న క్రేజ్ దృష్ట్యా, ఈ ధరతో రైట్స్ తీసుకుంటే రాబట్టుకోవటం పెద్ద కష్టమేమీ కాదంటున్నాయి మూవీ వర్గాలు.
సీడెడ్ మాత్రమే కాదు.. నైజాం, ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణ, గుంటూరు వంటి ఇతర ఏరియాల్లో కూడా OG రైట్స్ భారీ ధరలకు అమ్ముడైపోయినట్టు ట్రేడ్ వర్గాలంటున్నాయి. ఈ లెక్కన చూస్తే OG సినిమా థియేట్రికల్ ప్రీ-రిలీజ్ బిజినెస్ మొత్తం రూ. 150 కోట్లకు చేరే అవకాశం ఉంది. గ్లింప్స్తోనే సినిమాపై హైప్స్ పీక్స్కి చేరింది. రేపు టీజర్, ట్రైలర్తో ఏ రేంజ్కు చేరుకుంటుందోనని అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. ఇక బాక్సాఫీస్ రికార్డులు గల్లంతు కావటం పక్కా అని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మరొకసారి బ్లాక్బస్టర్ ఫామ్లోకి వచ్చి, తన మార్క్ను తిరిగి ప్రూవ్ చేయనున్నాడని అభిమానులు ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు.