రాష్ట్రంలో రానున్న వారం రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల వాయవ్య తెలంగాణ, మధ్య తెలంగాణ ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదవుతుంది.
రేపటి నుండి (జూన్ 16–21) వాతావరణమంతా మేఘావృతమై ఉంటుందని తెలిపింది. మధ్యాహ్నం సమయాల్లో మబ్బులతో కూడిన వాతావరణం తో పాటు అక్కడక్కడా కొద్దిపాటి చినుకుల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపటి నుంచి ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం కాస్త చల్లబడుతుందని పేర్కొంది.
ఈ ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు:
హైదరాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచన కనిపిస్తోంది. ఈ జిల్లాలో కొన్ని చోట్ల ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
ముఖ్య సూచనలు:
- బయటకు వెళ్తున్నప్పుడు జాకెట్ లేదా గొడుగు తీసుకెళ్ళాలి.
- రహదారి ప్రయాణాలకు ముందు వాతావరణ సమాచారాన్ని పరిశీలించాలి.