Tuesday, June 17, 2025
HomeNewsPeddi: రామ్ చ‌ర‌ణ్ రేంజ్ అంటే అది.. ‘పెద్ది’ ఓటీటీ డీల్ ఫిక్స్‌

Peddi: రామ్ చ‌ర‌ణ్ రేంజ్ అంటే అది.. ‘పెద్ది’ ఓటీటీ డీల్ ఫిక్స్‌

Ram Charan: గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ పెద్ది. చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసిన గ్లింప్స్‌తో సినిమాపై భారీ అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. ఈ మూవీని వ‌చ్చే ఏడాది మెగా ప‌వ‌ర్‌స్టార్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మార్చి 27న రిలీజ్ చేయ‌బోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. సినిమాను అనుకున్న ప్లానింగ్ ప్రకారం మేక‌ర్స్ పూర్తి చేస్తున్నారు. సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే సినిమా ఎలా ఉంటుందోన‌ని ఆస‌క్తి అభిమానులు స‌హా సాధార‌ణ ప్రేక్ష‌కుల్లోనూ క్రియేట్ అయ్యింది.

- Advertisement -

తాజా స‌మాచారం మేర‌కు ‘పెద్ది’ సినిమాకు భారీ ఓటీటీ డీల్ కుదిరింద‌ని ట్రేడ్ వ‌ర్గాలంటున్నాయి. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఓటీటీ సంస్థ‌లు డీల్స్ కుదుర్చుకోవ‌టానికి కండీష‌న్స్ పెడుతున్నాయి. ఫ‌లానా డేట్ అని చెప్పి.. ఆరోజు లోప‌లే సినిమాను విడుద‌ల చేయాలంటున్నాయి. రిలీజ్ డేట్‌లో ఏమాత్రం తేడా వ‌చ్చినా డీల్ డ‌బ్బుల్లో కోత ప‌డిపోతుంది. ఇప్పుడు కొన్ని స్టార్ హీరోల సినిమాలైతే రిలీజ్ డేట్స్ మార‌టం వ‌ల్ల ఓటీటీ డీల్స్ పూర్తి కాకుండానే ఉన్నాయి. వీటి లిస్టులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న విశ్వంభ‌ర‌తో పాటు రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టించిన ది రాజా సాబ్ సినిమా కూడా ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో పెద్ది సినిమాకు బేస్ ప్రైజ్ ఓటీటీ డీల్ కుదిరింది.

ALSO READ: https://teluguprabha.net/news/superstar-mahesh-as-pushparaj-video-goes-viral/

బేస్ ప్రైజ్ ఓటీటీ డీల్‌లో చాలా ఈక్వెష‌న్స్ ఉంటాయి. సినిమా ఇంకా స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉంది కాబ‌ట్టి.. అన్ని భాష‌ల‌కు క‌లిపి ఓ బేస్ ప్రైజ్ అనుకుని ఓటీటీ రైట్స్ డీలింగ్‌ను కుదుర్చుకుంటారు. సినిమాపై హైప్ పెరిగే కొద్ది ఈ రేటు కూడా పెరుగుతుంటుంద‌ని స‌మాచారం. ప్రస్తుత మీడియా వ‌ర్గాల స‌మాచారం మేర‌కు పెద్ది సినిమాకు కుదిరిన బేస్ ప్రైజ్ ఓటీటీ డీల్ రూ.100 కోట్ల‌కు పైగానే అని స‌మాచారం. ప్ర‌ముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌తో ఈ డీల్ కుదిరి నెల రోజుల‌వుతుంది. రంగ‌స్థ‌లం త‌ర‌హాలో రామ్ చ‌ర‌ణ్ లుక్ రా అండ్ మాస్‌గా ఉంది. ఇందులో త‌ను గ్రామంలో ఉండే స్పోర్ట్స్ ప‌ర్స‌న్‌గా క‌నిపించ‌నున్నాడు.య ప్ర‌స్తుతం ఓ సెట్‌ను నిర్మించి అందులో యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. చ‌ర‌ణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ న‌టిస్తుండ‌గా.. క‌న్న‌డ స్టార్ శివ రాజ్‌కుమార్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ట్రిపులార్ త‌ర్వాత భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో చేసిన గేమ్ చేంజ‌ర్ డిజాస్ట‌ర్ కావ‌టంతో ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ అండ్ కో.. ఆశ‌ల‌న్నీ పెద్ది పైనే ఉన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News