Shashi Tharoor’s “British Museum” Dig: ఒక భారతీయ యువకుడి బైక్ను లండన్లో దొంగిలించడంతో, కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ తనదైన శైలిలో బ్రిటిష్ ప్రభుత్వంపై పరోక్షంగా సెటైర్ వేశారు. ముంబైకి చెందిన యోగేశ్ అలేకరి అనే 33 ఏళ్ల యువకుడు తన కలల బైక్పై ప్రపంచ యాత్రకు బయలుదేరాడు. 17 దేశాలు, 24,000 కిలోమీటర్లు ప్రయాణించి యూకేకు చేరుకున్న తర్వాత, ఆగస్ట్ 28న నాటింగ్హామ్లో అతని బైక్ దొంగల పాలయ్యింది. దీనిపై సోషల్ మీడియాలో ఒక నెటిజన్ “ఈ సంఘటనపై మీ స్పందన ఏమిటి?” అని శశి థరూర్ని అడిగాడు. దానికి థరూర్ వెంటనే, “వారు బ్రిటిష్ మ్యూజియం నుండి నేర్చుకుంటున్నారు!” అని ఘాటుగా బదులిచ్చారు.
They’re learning from the British Museum! https://t.co/6uAIFgww4r
— Shashi Tharoor (@ShashiTharoor) September 4, 2025
ఈ ఒక్క వాక్యంతో శశి థరూర్ మొత్తం బ్రిటిష్ వలస పాలన చరిత్రను గుర్తు చేశారు. లండన్లోని బ్రిటిష్ మ్యూజియంలో వేలాది భారతీయ కళాఖండాలు, సంపదలు ఉన్నాయి. ఇవి వలస పాలన కాలంలో అక్రమంగా బ్రిటన్కు తరలించబడినవని భారతదేశం ఎప్పటి నుంచో వాదిస్తోంది. అదే విషయాన్ని థరూర్ తన ఒక్క వాక్యంలో ఎంతో వ్యంగ్యంగా చెప్పి నెటిజన్ల మనసు గెలుచుకున్నారు.
ALSO READ: PM Modi Hails GST: ‘స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద సంస్కరణ’.. జీఎస్టీపై ప్రధాని మోదీ ప్రశంసలు
గతంలో కూడా శశి థరూర్ బ్రిటిష్ పాలనపై చేసిన విమర్శలు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా, 2015లో ఆక్స్ఫర్డ్ యూనియన్ డిబేట్లో ఆయన చేసిన ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఆ ప్రసంగంలో “బ్రిటిష్ సామ్రాజ్యంపై సూర్యుడు అస్తమించకపోవడానికి కారణం, చీకట్లో ఇంగ్లీషు వారిని దేవుడు కూడా నమ్మడు కాబట్టి” అని చెప్పి థరూర్ అందరినీ ఆకట్టుకున్నారు.
ALSO READ: PNB Job : మానసిక ప్రశాంతతే ముఖ్యం.. అందుకే లక్షల జీతం ఇచ్చే బ్యాంక్ జాబ్ మానేశా!గం వదిలేసి!
ప్రపంచ యాత్రకు బయలుదేరిన యోగేశ్ అలేకరి తన బైక్ను నాటింగ్హామ్లోని ఒక పార్క్లో నిలిపి, అల్పాహారం కోసం వెళ్ళాడు. ఒక గంట తర్వాత తిరిగి వచ్చి చూసేసరికి బైక్తో పాటు తన పాస్పోర్ట్, డబ్బులు, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లు కూడా పోయాయని గుర్తించాడు. దీంతో షాక్కు గురైన యోగేశ్, తన కలల యాత్రకు ఇలా అడ్డుపడటంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన సామాజిక మాధ్యమాల ద్వారా బైక్ను, పాస్పోర్ట్ను కనుగొనాలని వేడుకున్నాడు.
ALSO READ: GST Rate Reduction : బీహార్ ఎన్నికల కోసమే..జీఎస్టీ రేట్ల తగ్గింపుపై చిదంబరం


