Sunday, July 7, 2024
HomeNews'ఆదిపురుష్' సినిమా థియేటర్‌లో ఉద్రిక్తత..

‘ఆదిపురుష్’ సినిమా థియేటర్‌లో ఉద్రిక్తత..

ప్రభాస్ – కృతి సనన్ జంటగా ఓం రనౌత్ డైరెక్షన్లో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ ఈరోజు వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో గ్రాండ్ రిలీజ్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో గత అర్ధరాత్రి నుండి ఆదిపురుష్ థియేటర్స్ వద్ద సందడి మొదలైంది. భారీ కటౌట్స్ , ప్లెక్సీ లు ఏర్పటు చేసి అభిమానులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఉన్న భ్రమరాంబ థియేటర్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. హనుమంతుడి కోసం కేటాయించిన సీట్లో కూర్చున్నందుకు ఒక వ్యక్తిని కొంతమంది కలిసి చితక్కొట్టారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం జరిగింది.

- Advertisement -

రామాయణాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కడం జరిగింది. ఈ క్రమంలో ఆదిపురుష్ సినిమాను ప్రదర్శించే అన్ని థియేటర్లల్లో కూడా ఒక సీట్‌ను హనుమంతుడి కోసం వదిలేసారు. ఆంజనేయస్వామి స్వయంగా వచ్చి ఈ సినిమాను చూస్తాడని యూనిట్ విశ్వసించి , ఆ సీటు ను ఖాళీగా వదిలేసారు.

కాగా హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో ఉన్న భ్రమరాంబ థియేటర్‌లో హనుమంతుడి కోసం కేటాయించిన సీట్లో ఓ వ్యక్తి తెలియక కూర్చున్నాడు. దీంతో కొంతమంది అతడిపై దాడికి పాల్పడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో థియేటర్లు సిబ్బంది గొడవ సద్దుమణిగేలా చేశారు. హనుమంతుడి సీట్లో కూర్చున్న వ్యక్తిని మరో సీట్లోకి పంపించారు.

మరో థియేటర్ లో ఆదిపురుష్ మూవీ రన్ అవుతుండగా ఓ వానరం థియేటర్ లోకి ఎంట్రీ ఇచ్చి అందరికి షాక్ ఇచ్చింది. కాసేపు సినిమాను చూసి వెళ్లిపోయింది. దీంతో ప్రేక్షకులు ఆ వానరాన్ని చూసి జై హనుమాన్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. సాక్ష్యాత్తూ హనుమంతుడే రామయణాన్ని చూడటానికి వచ్చాడు అంటూ ఆ వానరానికి చేతులెత్తి మొక్కారు. ఇదంతా థియేటర్ లోని ప్రేక్షకులు వీడియో తీశారు. వానరం కనిపించినంతసేపు ఆ థియేటర్ మొత్తం జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తిపోయింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News