Friday, June 20, 2025
Homeనేషనల్Trump-Munir Lunch: భారత్ దౌత్యానికి షాక్ - కాంగ్రెస్ ఆరోపణలు

Trump-Munir Lunch: భారత్ దౌత్యానికి షాక్ – కాంగ్రెస్ ఆరోపణలు

Congress On Trump Munir Lunch : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ భేటీని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. ఇది భారత దౌత్యానికి పెద్ద ఎదురుదెబ్బ అని, ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న ‘హగ్‌లోమసీ’ విధానం విఫలమైందని ఎద్దేవా చేసింది. విదేశాంగ విధానంలో మోదీ వ్యక్తిగత సాన్నిహిత్యానికే ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇది భారతదేశ దౌత్యపరమైన బలహీనతను చూపిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.

దేశాధినేత కాదన్నా… లంచ్ ఇచ్చి, ప్రశంసలు కురిపించిన ట్రంప్ :
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌ను అధ్యక్ష హోదాలో లేనప్పటికీ అమెరికాకు ఆహ్వానించి, లంచ్ ఇచ్చి, బహిరంగంగా ప్రశంసలు కురిపించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. “ఇది భారత దౌత్య విధానానికి తలవంపు” అని జైరాం రమేశ్ మండిపడ్డారు. మునీర్ దేశాధినేత కానీ, ప్రభుత్వాధినేత కానీ కాదని స్పష్టం చేశారు.

పహల్గాం దాడికి ముందు మునీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు : పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడికి ముందు ఆసిమ్ మునీర్ భారత్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ గుర్తు చేసింది. పాక్ ఆర్మీ, ఐఎస్‌ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్) అండతోనే పహల్గాంలో దాడి జరిగిందని జైరాం రమేశ్ తన ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొన్నారు.

విదేశాంగ శాఖ, పీఎంఓ బలహీనమా? కాంగ్రెస్ ప్రశ్న
భారత విదేశాంగ శాఖ, ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) దేశ అభిప్రాయాన్ని ప్రపంచానికి బలంగా చెప్పలేకపోతున్నాయా అని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ప్రశ్నించారు. మంగళవారం రాత్రి మోదీ-ట్రంప్ మధ్య 35 నిమిషాల పాటు టెలిఫోన్ సంభాషణ జరిగినా, “యుద్ధాన్ని నేనే ఆపాను” అని ట్రంప్ వ్యాఖ్యానించడాన్ని ఆయన నిలదీశారు.

మోదీ, ట్రంప్ మాటల్లో పొంతన లేదన్న కాంగ్రెస్ :
భారత విదేశాంగ శాఖ విడుదల చేసిన సమాచారం, ట్రంప్ మీడియాకు చెప్పిన వివరాలకు పొంతన లేదని పవన్ ఖేరా ఆరోపించారు. ఇది ప్రధానమంత్రి కార్యాలయాన్ని అవమానపరిచే విధంగా ఉందని, దీనిపై ప్రధాని మోదీయే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇరాన్‌పై మునీర్‌తో చర్చించలేదు: ఒవల్ ఆఫీస్ వద్ద మీడియా ప్రతినిధులు ఇరాన్ అంశంపై ప్రశ్నించగా, “ఇరాన్ గురించి మేమేమీ చెప్పాల్సిన అవసరం లేదు. పాకిస్థాన్‌కు ముందే తెలుసు. మునీర్‌తో నేను ఏకాభిప్రాయానికి వచ్చాను” అని ట్రంప్ తెలిపారు. “భారత్‌తో యుద్ధాన్ని ఆపినందుకు ధన్యవాదాలు చెబుతాను. మునీర్‌ను అమెరికా పర్యటనకు ఆహ్వానించాను” అని కూడా ఆయన వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News